కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. మునుగోడులో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలకు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక గెలుపు కోసం పార్టీలన్ని ఇప్పటికే పలు వ్యూహాలు సిద్ధం చేసి అమలు చేసే పనిలో ఉన్నాయి. ఇక మునుగోడులో కాంగ్రెస్కి చిత్రమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. రాజీనామా ముందు వరకు కూడా రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్లోనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన అన్న వెంకటరెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డి ఎలా వ్యవహరిస్తారనే దాని గురించి పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా వెంకటరెడ్డి వ్యవహారంపై కార్యకర్తలు మండి పడుతున్నారు. ఇలా చేయడం సరి కాదని సూచిస్తున్నారు. అంతేకాక కోమటిరెడ్డి ఫోన్కాల్స్ వ్యవహారంపై పెద్ద ఎతున్న దుమారం రేగుతోంది. ఆ వివరాలు... మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై కేడర్, ఇటు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి ఫోన్ చేసి తన తమ్ముడికి మద్దతివ్వాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ కార్యకర్తలు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించి.. ఇప్పుడిలా చేయడం ఏంటని మండి పడుతున్నారు కార్యకర్తలు. ఆయన ప్రచారానికి రాకుండా ఉన్నా పర్లేదు కానీ.. ఇలా పార్టీకి ద్రోహం చేసేలా ప్రవర్తిస్తే మర్యదగా ఉండదని కాంగ్రెస్ శ్రేణులు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాయి. అంతేకాక.. కాంగ్రెస్లో ఉంటావో.. లేదంటే తమ్ముడిలా బీజేపీలో చేరతావో తేల్చుకోమంటూ సూచించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి తమ్ముడికి మద్దతివ్వాలంటూ వెంకటరెడ్డి ఒత్తిడి తెస్తున్నారంటూ కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. దీనిపై ఆయనను వివరణ కోరుతుందా.. లేక ఆరోపణలను కొట్టి పారేస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: మునుగోడులో ప్రజాశాంతి పార్టీదే గెలుపు.. TRS పార్టీకి రూ.15 కోట్లు ఇచ్చా: కేఏ పాల్ ఇది కూడా చదండి: మునుగోడులో గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. లక్షమంది కాళ్లు మొక్కేందుకు సిద్దం!