సినిమాలు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. సినిమాల యువత చెడిపోతున్నారు అంటూ నోరు పారేసుకునేవాళ్లకు కొదవ లేదు. అలాంటి వారికి సరైన సమాధానం చెప్పే ఘటన ఒకటి తెలంగాణ దోమకొండలోని బీబీపేటలో జరిగింది. శ్రీమంతుడు సినిమా చూసిన తెరాస నాయకుడు సుభాష్ రెడ్డి కుమారుడు నేహాంత్… వాళ్ల నాన్నను అడిగిన ఒక కోరిక బీబీపేటలో పిల్లలకు అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల భవంతిని అదించింది. స్కూల్ భవన సముదాయం ప్రారంభం సందర్భంగా శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ భవంతి నిర్మాణం జరిగిందని తెలుసుకుని మంత్రి కేటీఆర్ కూడా ఆశ్చర్యపోయారు.
Moved beyond words to learn that #Srimanthudu was an inspiration behind this school! We are incredibly humbled Subhash Reddy garu 🙏🙏🙏 You are a true HERO.. We need more people like you! https://t.co/iGIlK1VlsK pic.twitter.com/Y6DGFPoIuJ
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021
వివరాల్లోకి వెళితే దోమకొండలోని బీబీ పేటలో తెరాస నాయకుడు, కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అక్కడి ప్రభుత్వ పాఠశాలకు అద్భుతమైన భవన సముదాయాన్ని నిర్మించి ఇచ్చారు. ‘భవనం నిర్మించారు అంటే ఏదో అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఆశ్యర్యపోయాను. రాష్ట్రం మొత్తంలో ఇలాంటి ఒక భవనం ఏ ప్రభుత్వ పాఠశాలకు లేదు. సుభాష్ రెడ్డి ఒక బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేశారు. ఇక మేమంతా దానిని అందుకునేందుకు కృషి చేయాలి. సుభాష్ రెడ్డి అంత కాకపోయినా మా నానమ్మ ఊరు కోనాపూర్లో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా’ అంటూ కేటీఆర్ తెలిపారు.
‘ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో నిర్మించారని. ముందే తెలిసుంటే మహేశ్ బాబునే పిలిచే వాళ్లం కదా. అలా చేస్తే ఇంకో పది మంది ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లు’ అంటూ కేటీఆర్ అన్నారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పదించాడు. ‘సుభాష్ రెడ్డిలాంటి వారు నిజమైన హీరోలు. ఈ సమాజానికి మీలాంటి వాకు ఎంతో అవసరం. జూనియర్ కాలేజ్ పూర్తవగానే నేను, శ్రీమంతుడు టీమ్ అందరం తప్పకుండా వస్తాం’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.
Will make sure to visit the college with my entire team of Srimanthudu once this noble project is complete. Respect always! 🙏🙏🙏@KTRTRS
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021