తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకంగా టీఆర్ఎస్ మినిస్టర్ హత్యకు స్కెచ్ వేయడం సంచలనంగా మారింది. పోలీసులు కుట్రను భగ్నం చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు.. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని.. దీనికి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశామని.. సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను.. సైబరాబద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సంబంధించి కుట్రను ఆదిలోనే గుర్తించి భగ్నం చేశామని తెలిపారు. ఈ కేసులో బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్రెడ్డి అనుచరుల ప్రమేయంపై ఆరా తీస్తున్నామన్నారు.
పాత నేరస్తులతో కలిసి కోర్టు ఆవరణలోనే ప్లాన్…
మహబూబ్నగర్కు చెందిన రాఘవేందర్రాజు, శంషాబాద్కు చెందిన ఫరూక్ అహ్మద్ పాత నేరస్తులు. గత ఏడాది నవంబర్ 18న వారిద్దరూ.. మహబూబ్నగర్ కోర్టులో కలిశారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ను హత్య చేసే ఉద్దేశంతో ఉన్న రాఘవేందర్రాజు.. కోర్టు ఆవరణలోనే ఈ విషయాన్ని ఫరూక్కు వివరించాడు. ఆ హత్యను ఫరూక్, అతడి గ్యాంగ్ చేసినా సరేనని.. లేదా ఆ పని చేయగలిగే వేరే వాళ్లనైనా తమకు పరిచయం చేయాలని కోరాడు. మంత్రిని హత్య చేసేందుకు రూ.15 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నాడు. కానీ తర్వాత భయపడిన ఫరూక్.. ఈ విషయాన్ని తన స్నేహితుడు మహబూబ్నగర్కు చెందిన హైదర్ అలీకి చెప్పాడు. దీనితో విషయం బయటపడుతుందేమోనని భావించిన రాఘవేందర్రాజు.. ఫరూక్, హైదర్అలీ ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇలా బయటపడింది..
ఫరూక్, హైదర్ అలీ ఇద్దరూ గత నెల 23న సుచిత్ర దగ్గర ఓ లాడ్జిలో దిగారు. 25న మధ్యాహ్నం 2 గంటలకు వారు టీ తాగేందుకు బయటికి వచ్చారు. ఆ సమయంలో మహబూబ్నగర్కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మరికొందరు కలిసి వారిని చంపేందుకు కత్తులతో వెంబడించారు. వారి నుంచి తప్పించుకున్న ఫరూక్, హైదర్అలీ.. సాయంత్రం 5 గంటల సమయంలో పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 26న యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్లను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
27న నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించగా.. మంత్రి శ్రీనివాస్గౌడ్ను హత్య చేసేందుకు జరిగిన కుట్ర బయటపడింది. మహబూబ్నగర్కు చెందిన రాఘవేందర్రాజు మరికొందరితో కలిసి మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని నాగరాజు వాంగ్మూలంలో వివరించాడు. ఈ వివరాలతోపాటు నిందితుల ఫోన్ లొకేషన్ ఆధారంగా.. రాఘవేందర్రాజు, మున్నూరు రవి, మధుసూదన్రాజు ముగ్గురూ ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి వారిని అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇక్కడ వారిని విచారించగా కుట్ర పూర్తి వివరాలు బయటపడ్డాయి.
ఢిల్లీకి పారిపోయిన సూత్రధారులు..
నిందితులను ప్రశ్నిస్తున్న సమయంలో మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు, అమరేందర్రాజు, మదుసూదన్ రాజు మరికొందరితో కలిసి ప్రముఖ నేత హత్యకు కుట్రపన్నినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా కూపీ లాగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. తమ అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలియగానే రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజు మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం చేరారు. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లారు. వీరికి ఢిల్లీలో జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, వ్యక్తిగత సహాయకుడు రాజు ఆశ్రయం ఇచ్చారు. అక్కడ నోటీసులు ఇచ్చిన అనంతరం అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు..
సూత్రధారులు విచారణలో కుట్రకోణం బట్టబయలు..
రాఘవేందర్రాజు వద్ద రెండు రౌండ్లున్న పిస్టల్, మున్నూర్ రవి నుంచి ఆరు రౌండ్లున్న రివాల్వర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులను ఉత్తరప్రదేశ్ లో కొనుగోలు చేసినట్టు గుర్తించారు. నిందితులు ఈ ఆయుధాలను దుండిగల్ అటవీ ప్రాంతంలో దాచిపెట్టారని, వారు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఆయుధాలను ఉత్తరప్రదేశ్ నుంచి కొనుగోలు చేసినట్టు నిందితులు చెప్పారని, ఎవరి వద్ద కొన్నారనేది ఇంకా తేలాల్సి ఉందని సీపీ వివరించారు. నిందితులను విచారించినపుడు అసలు కుట్రకోణం బయటపడింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పథకం రచించినట్లు తేలింది. మదుసూదన్ రాజు ఈ బాధ్యతను నాగరాజుకు అప్పగించాడు.
మంత్రిని హత్య చేసినా, ఎవరితోనైనా చేయించినా రూ.15 కోట్లు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఫరూఖ్ ఈ విషయాన్ని తన స్నేహితుడు హైదర్ అలీతో పంచుకున్నాడు. రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని ఫరూఖ్ బయటపెట్టడంతో ఆ ఇద్దరినీ హతమార్చాలని నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు పట్టుబడటంతో మంత్రి హత్యకు పన్నిన కుట్ర బయటకు వచ్చింది. దీనిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుచరులకు కూడా ఈ వ్యవహారంలో హస్తమున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. నిందితులను క్షుణ్నంగా విచారించి, పూర్తి వివరాలను రాబడతామని ప్రకటించారు. దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.