KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై తన మాటలతో విరుచుకుపడ్డారు. శనివారం మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లు అయింది. కృష్ణా నది నీళ్లలో వాటాల గురించి ట్రిబ్యునల్కు చెప్పమని మోదీని అడిగా. ఆయన పట్టించుకోలేదు. మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే.. రేపు మునుగోడుకు వత్తున్నవా? చెప్పు బిడ్డా అమిత్ షా. ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద ఇప్పుడు నేను మాట్లాడుతున్నా.
రేపు నువ్వు మాట్లాడతావు. మాకు కావాల్సింది.. నీ బొమ్మలు కాదు. ఈ బొమ్మలు మస్తుగ జూసినం. మీ తాత ,జేజమ్మ బొమ్మలు కూడా జూసినం మేము. కొట్లాట మొదలు పెడితే యాందాకైనా కొట్లాడతాం.. ఆగస్టు 15న ప్రధాని మాట్లాడితే మైకులు పగిలిపోయాయి. ఒక్కమంచి మాటైనా ఉన్నదా. ఏందిది ప్రజా స్వామ్యమా.. అహం కారమా.. బలుపా.. అధికారమధంతోని కళ్లు మూసుకుని పోయినయా.. ఏందిది.. దేశమా.. అరచకమా.. ఎవరిని పడితే వాళ్లను.. ముఖ్యమంత్రులను పెద్ద పెద్ద వాళ్లను కూడా నీ మీద ఈడీ కేసు పెడతా.. ఈడా బోడా రాబే అని నేను అన్నా.
ఈడీ వస్తే నాదగ్గర ఏముంది. వాడే నాకు చాయ్ తాగించి పోవాలి. దొంగలు భయపడతారు.. లంగలు భయపడతారు. ధర్మంగా ఉన్నవాళ్లు.. నిజాయితీగా ఉన్న వాళ్లు ఎందుకు భయపడతారు. ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో. ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలి. మీరు గోకినా గోకకపోయినా.. నేను గోకుతా’’ అని అన్నారు. మరి, కేంద్రంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అమ్మాయిలా నటిస్తూ, రొమాంటిక్గా చాటింగ్.. తర్వాత జరిగింది ఇదే!