ప్రస్తుతం సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ట్విట్టర్ ది కాస్త భిన్నమైన పాత్ర. మన అభిప్రాయాలను వెల్లడించడమే కాక.. ఏదైనా సమస్య వస్తే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ట్విట్టర్ సరైన వేదికగా భావిస్తారు. మీమ్స్తో చెలరేగిపోతారు. తమకు ఏదైనా సమస్య వచ్చినా.. వెంటనే సంబంధిత నాయకులు, అధికారులను ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తుంటారు ఇలా అందరికి అన్ని విధాలుగా ఉపయోగపడే ట్విట్టర్ కు సమస్య వస్తే.. తమ బాధను మరెవరికి చెప్పుకోవాలంటూ మీమ్స్ రూపంలో చెలరేగిపోతున్నారు యూజర్లు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సేవల్లో కొంత సమయం అంతరాయం నెలకొంది. తమ ఖాతాలు పనిచేయడం లేదంటూ ప్రపంచ వ్యాప్తంగా పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత యూజర్ల ట్విట్టర్ ఖాతాల్లో సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ లో గంటపాటు ట్విట్టర్ సేవలను ఉపయోగించుకోలేకపోయినట్లు పలువురు యూజర్లు పేర్కొన్నారు. పోస్టింగులు చేయలేకపోయామని కొందరు, లాగిన్ కాలేకపోయామని కొందరు.. ఉపయోగిస్తుండగానే లాగౌట్ అయిందని మరికొందరు ఫిర్యాదు చేశారు.
దీనిపై ట్విటర్ సపోర్ట్ టీమ్ స్పందించింది. సాంకేతికంగా సమస్య తలెత్తిందని, వెంటనే సరిచేసినట్లు తెలిపింది. అంతరాయానికి క్షమించాలని యూజర్లకు విజ్ఞప్తి చేసింది.
We’ve fixed a technical bug that was preventing timelines from loading and Tweets from posting. Things should be back to normal now. Sorry for the interruption!
— Twitter Support (@TwitterSupport) February 11, 2022