5G: భారతదేశంలో అతి త్వరలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరగనున్న ‘‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’’ కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టునున్నారు. ఈ మేరకు మినిష్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, నేషనల్ బ్రాడ్బాండ్ మిషన్ శనివారం ఓ ట్వీట్ చేసింది. ఇక, 5జీ సేవలు తొలి దశలో హైదరాబాద్తో సహా 13 నగరాల్లో ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ, గుర్గావ్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పుణె, చండీఘర్, గాంధీనగర్, అహ్మాదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రానున్న మూడు, నాలుగేళ్లలో చిన్న పట్టణాలకు కూడా 5 జీ సేవలు విస్తరించే అవకాశం ఉంది.
ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వీఐ(వొడాఫోన్ ఇండియా) లాంటి నెట్వర్క్స్ పలు నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ సైట్స్ను సెటప్ చేశాయి. కాగా, జూలై 26 నుంచి ఆగస్టు 1 వరకు జరిగిన స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 10 బ్యాండ్స్లో 72,098 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలంలోకి తీసుకురాగా.. 51,236 మెగాహెట్జ్ స్పెక్ట్రం అమ్ముడైంది. అమ్మిన మొత్తం స్పెక్ట్రంలో దాదాపు సగభాగాన్ని రిలయన్స్ జియోనే బిడ్లతో దక్కించుకుంది. మరి, భారత్లో అక్టోబర్ 1వ తేదీనుంచి ప్రారంభం కానున్న 5జీ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : AU Invention: ఆంధ్రా వర్సిటీ అద్భుత ఆవిష్కరణ.. షుగుర్ టెస్టు ఇప్పుడు మరింత చౌక!