టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆడితే రికార్డుల పంట పండుతుందన్న విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీకి రికార్డుల రారాజుగా పేరుంది. ఇటివల ఆసియా కప్ 2022లో 71వ సెంచరీతో కోహ్లీ తిరిగి తన భీకర ఫామ్ను అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. కేవలం 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సులతో 122 పరుగులు చేసి దుమ్ములేపాడు. ఈ సెంచరీతో కోహ్లీ ఏకంగా 12 రికార్డులు సృష్టించాడు. తాను ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి మరోసారి చూపించాడు. ఇన్నాళ్లు సెంచరీ.. సెంచరీ అంటూ తన మీద పడి ఏడ్చిన విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు.
ఇలా తన బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచంలో పరుగులు వరద పారిస్తూ.. రికార్డుల పంట పండిస్తున్న కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ తన సత్తా చాటుతున్నాడు. ట్విట్టర్లో విరాట్ కోహ్లీని ఏకంగా 50 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటూ 5 కోట్ల మంది అన్నమాట. ఒక క్రికెటర్ను సోషల్ మీడియాలో ఇంతమంది ఫామ్ అవ్వడం ఇదే తొలి సారి. ప్రపంచం మొత్తం మీద 50 మిలియన్ ఫాలోవర్లు కలిగి ఏకైన క్రికెట్ కోహ్లీనే. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ను అభిమానించే వాళ్ల సంఖ్యలో ఎక్కువ శాతం మంది కోమ్లీ అభిమానులే. సోషల్ మీడియా ఫాలోయింగ్లో కోహ్లీ కంటే ముందు ఫుట్బాల్ స్టార్లు ఉన్నారు.
ఆటగాళ్ల పరంగా చూసుకుంటే.. ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(103.4మిలియన్లు) 10కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉన్నాడు. మరో ఫుట్బాల్ ప్లేయర్ నెయ్ మర్ (57.9మిలియర్లు), 57.9కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఇకపోతే కోహ్లీకి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వారి సంఖ్య వింటే షాక్ అవుతారు. ఇన్స్టాలో విరాట్ను ఏకంగా 211 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే 21 కోట్ల మంది ఫాలోవర్లు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్న కోహ్లీకి ఇలా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉండటంపై ఇండియన్ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఫామ్ లోకి వచ్చాక.. లండన్ లో భార్యతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ!
Thank you for all the love and support throughout the Asia Cup campaign. We will get better and come back stronger. Untill next time ❤️🇮🇳 pic.twitter.com/yASQ5SbsHl
— Virat Kohli (@imVkohli) September 9, 2022