ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. ఆడిన మూడు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్ ఇప్పటికే సిరీస్ను 3-0 తో కోల్పోయింది. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ జట్టు తృటిలో మరో ఓటమి నుంచి తప్పించుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుత పోరాటపటిమ కనబర్చి మ్యాచ్ను డ్రా చేసుకోగలిగారు.
The Ashes👍 #SteveSmith #Bairstow pic.twitter.com/CS71YJC3Co
— MV (@Nan_varuven) January 9, 2022
— TOI Sports (@toisports) January 9, 2022
ఆసీస్ నిర్ధేశించిన 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ నష్టపోకుండా 30 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు పేలవ బ్యాటింగ్ ప్రదర్శనను మరోసారి కొనసాగించారు. టాపార్డర్ మరోసారి దారుణంగా విఫలమైంది. బెన్ స్టోక్స్ (123 బంతుల్లో 60), బెయిర్ స్టో (105 బంతుల్లో 41)లు ఇంగ్లాండ్ ను ఆదుకున్నా, మూడో సెషన్లో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ చేతులెత్తేసింది. చివరి రోజు ఆటలో రెండు ఓవర్లతో ఆట ముగుస్తుందనగా 270 పరుగుల వద్ద 100 వ ఓవర్ లో ఇంగ్లాండ్ తొమ్మిదో వికెట్ను కోల్పోవడంతో అసలు టెన్షన్ మొదలైంది. ఆసీస్ గెలుపుకు ఒక వికెట్ దూరంలో ఉండగా, స్మిత్ ఆఖరి ఓవర్ వేశాడు. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్లు తమ అనుభవాన్నంతా ఉపయోగించి ఇంగ్లండ్ను గట్టెక్కించారు. స్మిత్ కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా ముగిసింది. ఇక చివరి టెస్టు మ్యాచ్ హోబర్ట్ వేదికగా ఈ నెల 14 నుంచి 18 వరకు జరగనుంది.