ఉప్పల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం నాడు జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణపై, మాజీ చీఫ్ జస్టిస్ కక్రూ, తెలంగాణ ఏసీపీ డీజీ అంజనీ కుమార్, భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజులతో హైలెవల్ కమిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఆ వివరాలు..
ఉప్పల్ స్టేడియంలో సుమారు మూడేళ్ల తర్వాత మ్యాచ్ జరుగుతుండటంతో క్రీడాభిమానులు టికెట్ల కోసం గురువారం నాడు ఎగబడ్డారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. హెచ్సీఏలో విభేదాలు, టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు రావడంతో, ఈ విషయాలను తేల్చడానికి హైలెవెల్ కమిటీ వేసింది. ఇప్పటికే.. ఆ కమిటీ మ్యాచ్ నిర్వహణపై, రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎలాంటి జోక్యం చేసుకోబోమన్న కమిటీ, మ్యాచ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. 26న కమిటీ ఉప్పల్ స్టేడియంను పరిశీలిస్తుందని.. అదే రోజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని కమిటీ పేర్కొంది.
#Hyderabad SupremeCourt-appointed supervisory committee 2 manage #HCA Friday resolved to refrain from expressing its opinion or intervene. Gives HCA full freedom.Chairman Justice(retd) NA Kakru ll review SC mandated issues & address media Monday, day after 3rd #INDvsAUST20I pic.twitter.com/8yjjaA4aCV
— Rahul V Pisharody (@rahulvpisharody) September 23, 2022
కాగా, టిక్కెట్ల గోలపై హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాలకు, తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టికెట్ల సేల్స్ను థర్డ్ పార్టీకి అప్పగించామని వెల్లడించారు. ఈ నెల 15న ఆన్ లైన్ లో 11,450 టికెట్లు, కార్పోరేట్ బుకింగ్ కోసం పేటీఎం ద్వారా 4 వేల టికెట్లు విక్రయించినట్లు తెలిపారు. అలాగే.. డైరెక్ట్ స్పాన్సర్స్ కు 6 వేల టికెట్లు కేటాయించినట్టుగా తెలిపారు. ఇవన్నీ తెలుసుకోకుండా, క్రికెట్ గురించి ఏమాత్రం తెలియని వాళ్లు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is so disappointing. Passionated fans gathered at Gymkhana Ground to collect India Vs Australia tickets in Hyderabad and they’re getting such treatment. pic.twitter.com/OIP96BClOH
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2022
ఇకపోతే.. హెచ్సీఏ టిక్కెట్ల గొడవపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామని తెలిపిన ఆయన, టికెట్లను బ్లాక్లో అమ్మినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి రేపు ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించనున్నారు. స్టేడియం సామర్థ్యం ఎంత? ఎన్ని టికెట్లు విక్రయించారనే ఓ కొలిక్కి రానుంది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Case under section 430 & 337 IPC has been filed against HCA and Azharuddin for selling tickets in black. #INDvAUS pic.twitter.com/DzqoJdpITS
— All About Cricket (@allaboutcric_) September 23, 2022