అభిమానం హద్దు మీరింది. ఆటను ఆటగా చూడాల్సిన అభిమానులు సహనం కోల్పోయారు. దాంతో మైదానం కాస్తా.. శ్మశానంగా మారింది. ఆటపై అభిమానం 127 మంది ప్రాణాలను బలికొన్నది. తమ జట్టు ఓడిపోయింది అన్నఅక్కసుతో.. గెలిచిన జట్టు అభిమానులపై ఘర్షణకు దిగారు. దీంతో మైదానం ఒక్కసారిగా రణరంగంగా మారి.. ఓ యుద్ధాన్నే తలపించింది. ఈ దారుణ సంఘటన ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఆట ఏదన్నా ఉందంటే.. అది ఫుట్ బాల్ అనే చెప్పాలి. అయితే ఈ ఫుట్ బాల్ గేమ్ కొన్ని కొన్ని సార్లు యుద్ధాన్ని కూడా తలపిస్తుంది. మైదానంలోనే ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. కానీ అభిమానులు కొట్టుకున్న సందర్బాలు మాత్రం చాలా అరుదు. ఇక విషయంలోకి వెళితే.. తాజాగా ఇండోనేషియా దేశంలోని తూర్ఫు ప్రావిన్స్ ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో అరెమా వర్సెస్ పెర్సెబాయ సురబాయ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అరెమా జట్టు 3-2తో ఓడిపోయింది. దాంతో సహనం కోల్పోయిన అభిమానులు ఒక్క సారిగా ప్రత్యర్థి అభిమానులతో ఘర్షణకు దిగారు.
ఈ క్రమంలోనే వేలాది మంది గ్రౌండ్ లోకి రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కాస్తా ఉద్రిక్తంగా మారింది. అభిమానులు పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి.. వాటికి నిప్పు పెట్టారు. అభిమానులను నియంత్రించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. లాఠీ ఛార్జ్ చేసి వారిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో 127 మంది మరణించగా.. 180 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రపంచం మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన పై నెటిజన్స్ స్పందిస్తూ.. అభిమానం ఉండాలిగానీ మరీ ఇంత ఉండకూదంటున్నారు.. ఇండోనేషియన్ ఫుట్ బాల్ అసోషియేషన్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.
🇮🇩 | URGENTE: Al menos 127 muertos y cerca de 200 heridos enfrentamientos en Indonesia en la que se considera la peor tragedia en un estadio de fútbol de la historia. pic.twitter.com/MYllmOnmlq
— Alerta News 24 (@AlertaNews24) October 2, 2022