టీమిండియా vs పాకిస్తాన్.. ఈ దాయాదుల పోరు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. టీ20 మజాను మరోసారి చూపించిందంటూ క్రికెట్ ఫ్యాన్స్, మాజీలు సైతం ప్రశంసిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్పై రావల్పిండి ఎక్స్ ప్రెస్, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. అసలు ఆ మ్యాచ్ క్రికెట్కు బ్యాడ్ డే అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
“భారత్ అలాగే పాకిస్తాన్ క్రికెట్ టీమ్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే మ్యాచ్లో ఓడిపోయేందుకు ఇరు జట్లు ఎంతోబాగా కృషి చేశాయి. పాకిస్తాన్ మాత్రమే కాదు భారత్ కూడా ఓడిపోవడానికి తీవ్రంగానే కృషి చేసింది. కానీ, వారి ప్రయత్నాలకు హార్దిక్ పాండ్యా అడ్డు పడ్డాడు. దాంతో టీమిడింయా మ్యాచ్లో విజయం సాధించింది” అంటూ షోయబ్ అక్తర్ వెటకారంగా స్పందించాడు.
Wow wow wow ! Fantastic Hardik Pandya. Sab kuchh main karega. Brilliant performance by Bhuvi, good hand by Jaddu and Kohli as well.
Glad to see a close #INDvsPAK match after a long time. Mast maza aa gaya. pic.twitter.com/HLNrnLRpK8— Virender Sehwag (@virendersehwag) August 28, 2022
అతను అలా ఎందుకు మాట్లాడాడో కూడా ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చాడు. “బాబర్ అజమ్ని ఓపెనింగ్కు రావొద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఫఖర్ జమాన్- రిజ్వాన్ కలిసి ఓపెనింగ్ చేస్తే.. బాబర్ వన్ డౌన్లో వచ్చి కీలక పాత్ర పోషించేందుకు వీలుంటుంది. భారత్ కూడా జడేజాను నాలుగో స్థానంలో పంపింది. రెండు జట్లు కూడా బ్యాడ్ క్రికెట్ను ఆడాయి. ఇరు జట్లు దారుణమైన క్రికెట్ ఆడాయి.”
It came down to fitness of the fast bowlers while put under pressure, though both teams’ pacers bowled well upfront.
Crucial knock by Hardik to stay till the end & get us over the line & ably supported by @imjadeja & Virat.
Congrats 🇮🇳 on a nail-biting win.#INDvsPAK pic.twitter.com/dYhiaa3Omh
— Sachin Tendulkar (@sachin_rt) August 28, 2022
“42 బంతుల్లో మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులు చేయడం అనేది ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఎన్ని డాట్ బాల్స్ ఆడితే అంత ప్రమాదంలో పడినట్లే. పాక్ ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లలో 19 డాట్ బాల్స్ పడ్డాయి. రిషబ్ పంత్ను పక్కన పెట్టి భారత్ సైతం పెద్ద తప్పే చేసింది. పాకిస్తాన్ చూస్తే ఇఫ్తార్ అహ్మద్ను నాలుగో స్థానంలో పంపింది. నేను ఎవరినీ అగౌరవపరిచేందుకు చెప్పడం లేదు. ఇది క్రికెట్ కు బ్యాడ్ డే. ఎవరు ఎమనుకున్నాను నేను మాత్రం లెక్కచేయను” అంటూ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.
India won the match
#IndiaVsPakistan #INDvsPAK pic.twitter.com/HrENWPwASg— Vikas Bhadauria (@vikasbha) August 28, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ 19.5 ఓవర్లో పాక్ను 147 పరుగులకే ఆలౌట్ చేసింది. లక్ష్య చేధనలో మొదట తడబడిన భారత్ తర్వాత నిలదొక్కుని రెండు బాల్స్ మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. విరాట్ కోహ్లీ(35), జడేజా(35), పాండ్యా(33), భువనేశ్వర్(4 వికెట్లు), హార్దిక్ పాండ్యా(3 వికెట్లు), అర్షదీప్ సింగ్(2వికెట్లు), అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.