సచిన్.. క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం. అభిమానులు ఎలాగైతే సచిన్ ను ఆరాధిస్తారో.. సచిన్ సైతం తన అభిమానులను అదే విధంగా ట్రీట్ చేస్తాడు. అయితే తాజాగా భారతదేశం వేదికగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో.. టీమిండియా లెజెండ్స్ జట్టుకు సారథిగా సచిన్ ఉన్నాడు. ఇక సచిన్ సారథ్యంలో వరుసగా 2వ సారి లెజెండ్స్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక లెజెండ్స్ ను 33 పరుగులతో చిత్తు చేసింది. ఈ విజయానంతరం సచిన్ తన ట్వీటర్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సచిన్ టెండుల్కర్.. అందరు అతడికి వయసై పోయింది అనుకుంటారు. కానీ తాజాగా జరిగిన రోడ్ సేఫ్టీ సిరీస్ లో అతడి ఆట చూస్తే.. గురూజీ మీకింక వయసై పోలేదు అని కచ్చితంగా అంటారు. తాజా మ్యాచ్ ల్లో సచిన్ సొగసైన బ్యాటింగ్ చూస్తే మళ్లీ పాత రోజుల్లో సచిన్ గుర్తుకు రాక మానడు. ఇటీవల కొట్టిన సిక్స్ తో 1998 నాటి మాస్టర్ బ్లాస్టర్ ను గుర్తు చేశాడు. తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా లెజెండ్స్ కప్ గెలిచిన తర్వాత.. సచిన్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సచిన్ ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు..”మా లెజెండ్స్ జట్టు అద్భుతంగా ఆడింది. ప్రతీ ఒక్క ఆటగాడు చాలా బాగా రాణించాడు. ప్రత్యేకించి ఓజా ఆట అద్బుతం. సెమీ ఫైనల్లో, ఫైనల్లో అతడు ఆడిన తీరు గొప్పగా ఉంది. ప్రస్తుతం లెజెండ్స్ జట్టుకు ఆడటం, అప్పట్లో టీమిండియాకు ఆడటం నేను గౌరవంగా భావిస్తాను. ఎప్పటికైనా ఇండియా జట్టే నా ప్రధమ ప్రాధాన్యం. ఇక ఈ విజయాన్ని నా సహచర జట్టు ఆటగాళ్లకు, అభిమానులకు అంకితం చేస్తున్నా” అని భావొద్వేగంతో రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై అభిమానులు స్పందిస్తూ..”మీరు ఇలాంటి విజయాలు మరెన్నొ భారత్ కు అందివ్వాలి” అని కొంత మంది రాయగ.. మీరు అభిమానులను ఎప్పుడూ గౌరవిస్తారు.. మీలో మాకునచ్చేది అదే” అంటూ రాసుకొచ్చారు.
For India then, now & forever! 🇮🇳
A fantastic effort from the team to win the #RoadSafetyWorldSeries once again. The way @namanojha35 batted last night was simply brilliant.This is for all my teammates and amazing fans! 💙 pic.twitter.com/QAfnGlklkR
— Sachin Tendulkar (@sachin_rt) October 2, 2022