బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ)కి నూతన అధ్యక్షుడి నియామకం జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు రోజర్ బిన్నీని నూతన అధ్యక్షుడిగా బీసీసీఐ ప్రకటించింది. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇకపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అయిపోయాడు. ఈ నెల 11, 12 తేదీల్లో బీసీసీఐ అధ్యక్ష, ఇతర పదవుల కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నుంచి రోజర్ బిన్నీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో.. ఆయనను కొత్త అధ్యక్షుడిగా బీసీసీఐ ప్రకటించింది.
కాగా.. రెండో సారి కూడా బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నిక అవుతారని అంతా భావించినా.. స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండో సారి అధ్యక్ష పదవి ఎవరూ చేసిన సంప్రదాయం లేకపోవడంతో దాదాను బోర్డు సభ్యులు వ్యతిరేకించారు. రెండో సారి కూడా పదవిలో కొనసాగేందుకు గంగూలీ సుముఖంగా ఉన్నా.. మిగతా బోర్డు సభ్యులు దాదాకు సహకరించలేదనే వార్తలు వచ్చాయి. అలాగే గంగూలీని రెండో సారి అధ్యక్షుడిగా కాకుండా.. బీజేపీ పెద్దలతో పాటు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఐపీఎల్ చైర్మన్ పదవిని దాదాకు ఆఫర్ చేయగా.. దాన్ని గంగూలీ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో.. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
🚨 Just in: Roger Binny is the new BCCI president, taking over from Sourav Ganguly pic.twitter.com/YkRLzGZVf8
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2022