ఐపీఎల్-2022 సీజన్ కి ఇంకా చాలా సమయం ఉంది. కానీ.., త్వరలో మెగా ఆక్షన్ ఉండటం, రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి సమయం దగ్గర పడుతుండటంతో అప్పుడే ఐపీఎల్ ఫీవర్ మొదలైపోయింది. అన్నీ ఫ్రాంఛైజీలు తమ స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటూ వారిపై కోట్లు కుమ్మరిస్తున్నాయి.
ఇప్పటికే చెన్నై ధోనిని రిటైన్ చేసుకుంది. బెంగుళూరు కోహ్లీకి ఓటు వేసేసింది. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ విషయంలో తగ్గదే లే అని ప్రకటించేసింది. సన్ రైజర్స్ ఎలాగో రషీద్ ఖాన్ ని వదులుకునే సమస్యే లేదు. ఇక ముంబై కూడా రోహిత్ శర్మని రిటైన్ చేసేసుకుంది. కానీ.., ఎటొచ్చి పంజాబ్ పరిస్థితే అర్ధం కావడం లేదు. ఆ జట్టు ఒక్క ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదట. పంజాబ్ టీమ్ ఓనర్ ప్రీతీ జింటా ఈ విషయంలో ఆ క్లారిటీ కూడా ఇచ్చేసింది. ప్రీతీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కే.ఎల్. రాహుల్ అన్న టాక్ వినిపిస్తోంది.
కే.ఎల్. రాహుల్ గత కొన్ని సీజన్స్ నుండి పంజాబ్ టీమ్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రాహుల్ ఆ జట్టు కెప్టెన్ కూడా. ప్రతి సీజన్ లో పంజాబ్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది. కానీ.., రాహుల్ పై ప్రెజర్ పెట్టిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈసారి కూడా పంజాబ్ టీమ్ రాహుల్ ని రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ.., రాహుల్ మాత్రం లక్నో వైపు మొగ్గు చూపాడు.
తనని రిటైన్ చేసుకున్నా సరే అవసరం లేదు అంటూ లక్నోకి జెండా ఊపేశాడు. మిగిలిన స్టార్ ఆటగాళ్లు అంతా తమ తమ ఫ్రాంఛైజీలపై లాయల్టీ చూపిస్తూ ఉంటే.. రాహుల్ మాత్రం బయటకి వెళ్లిపోవడానికి ఆసక్తి చూపించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.
రాహుల్ పంజాబ్ కి హ్యాండ్ ఇవ్వడంతో ఆ జట్టుకి పెద్ద కష్టమే వచ్చి పడింది. రిటైన్ పాలసీ ప్రకారం అంటిపెట్టుకునే మొదటి స్టార్ ప్లేయర్ కి రూ.16 కోట్ల ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.., రాహుల్ తప్పించి అంత మొత్తం చెల్లించతగ్గ స్టార్ ప్లేయర్ పంజాబ్ టీమ్ లో లేడు. దీంతో టీమ్ లో ఉన్న చిన్న ప్లేయర్స్ కి ఎక్కువ మొత్తం చెల్లించి ఉంచుకోలేక, ప్రీతీ జింటా ఎవ్వరిని రిటైన్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో రాహుల్ పై ప్రీతీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
గతంలో బెంగుళూరు టీమ్ రాహుల్ దారుణంగా విఫలం అయ్యాకనే పంజాబ్ అతన్ని భారీ ధరకి దక్కించుకుంది. నిజానికి పంజాబ్ టీమ్ లోకి వచ్చాకనే రాహుల్ టీ20 గేమ్ మెరుగైంది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన ఫ్రాంఛైజీ కష్ట కాలంలో వదిలేసి వెళ్ళిపోయినందుకే ప్రీతీ జింటా రాహుల్ మీద కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి.. కే. ఎల్. రాహుల్ పంజాబ్ టీమ్ ని వదిలేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.