ప్రపంచ క్రికెట్లో తాజాగా సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్ లను ఆడడానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ.. పాక్ లోకి అడుగుపెట్టింది. ఇక తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్ లో మాత్రం తడబడింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఈక్రమంతో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దాంతో గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును తాజాగా తిరగరాసింది బాబర్-రిజ్వాన్ ల జోడీ. దీంతో పాక్ సిరీస్ ను 1-1గా సమం చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్.. ఆసియా కప్ రన్నరప్.. అదీ కాక ఈ మధ్య కాలంలో తన అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో పరాజయం పాలైనప్పటికీ.. పుంజుకుని రెండో మ్యాచ్ లో దుమ్మురేపింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు సాల్ట్-హేల్స్ జోడి 5.1 ఓవర్లలో 42 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే హేల్స్(26) ను దహని బోల్డ్ చేశాడు. దాంతో క్రీజ్ లోకి టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ గా గుర్తింపు పొందిన డేవిడ్ మలన్ వచ్చాడు. అతడిని కూడా తన నెక్ట్స్ బాల్ కే దహాని మలన్ (0)ను బౌల్డ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన డకెట్.. సాల్ట్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సాల్ట్ (30) పరుగుల వద్ద హారిస్ రౌఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అనంతరం డకెట్ 22 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసి నవాజ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
అనంతరం క్రీజ్ లోకి వచ్చిన బ్రూక్, మెుయిన్ అలీ రెచ్చిపోయి ఆడారు. బ్రూక్ 19 బంతుల్లో ఫోర్, 3 సిక్స్ లతో 31 పరుగులు చేయగా.. అలీ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. దాంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హరిస్ రౌఫ్, దహాని చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 200 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్ 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ లతో 110 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు పాక్ బ్యాటర్లపై ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. బాబర్-రిజ్వాన్ ల జోడీ దూకుడు ప్రదర్శిస్తూనే.. ఆడుతూ.. పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ క్రమంలోనే ఈ జోడీ ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో వికెట్ నష్టపోకుండా అత్యధిక రన్స్ ఛేదించిన జట్టుగా పాక్ చరిత్ర సృష్టించింది. అదీ కాక గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును బాబర్-రిజ్వాన్ జోడీ తిరగరాసింది. 2019లో సౌతాఫ్రికాపై ఈ జోడి వికెట్ నష్టపోకుండా 197 పరుగులు చేసింది. తాజాగా ఈ రికార్డు బద్దలు అయ్యింది. 2021లో పాక్ 10 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో సారి ఈ జోడి ప్రపంచ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ అని నిరూపించుకుంది. మరి బాబర్-రిజ్వాన్ ల రికార్డు బ్రేక్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Utter domination 💪
Pakistan bounce back in the T20I series with a comprehensive 10-wicket win over England.#PAKvENG | 📝Scorecard: https://t.co/WHBPS7jrZE pic.twitter.com/2eNgGw4Q6J
— ICC (@ICC) September 22, 2022
🗣️ T20I cricket’s most prolific pair Babar Azam and Mohammad Rizwan discuss the process behind their success.#PAKvENG | #UKSePK pic.twitter.com/0EHqhscuQl
— Pakistan Cricket (@TheRealPCB) September 22, 2022