టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెటర్ నుంచి ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారబోతున్నాడు. ఇప్పటికే పలు స్పోర్ట్ ఫ్రాంచైజ్ల్లో పెట్టుబడులు, కోచింగ్ అకాడమీలతో క్రికెట్ రంగంలో డబ్బులు సంపాదిస్తున్న ధోని. ఇటివల ‘ధోని ఎంటర్మైంట్స్’ ప్రొడక్షన్ కంపెనీలో సౌతా ఇండియాలోని తెలుగు, తమిళ్, మళయాల భాషల్లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్, సినిమాతో పాటు.. తాజాగా వ్యవసాయ రంగంలోకి కూడా ధోని ఎంటర్ అవుతున్నాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న ఈ తరుణంలో.. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచాలనే ఉద్దేశంతో గరుడ ఏరోస్పేస్ అనే సంస్థ వ్యవసాయ క్షేత్రాల్లో పురుగుమందుల పిచికారీ కోసం భారీ డ్రోన్లను ఉత్పత్తి చేస్తోంది.
గరుడ ఏరోస్పేస్ కంపెనీ తయారుచేసిన ‘ద్రోణి’ అనే డ్రోన్ను ధోనినే లాంచ్ చేశాడు. ఈ కంపెనీకి ధోని బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉంటున్నాడు. పైగా ఈ కంపెనీలో ధోని పెట్టుబడులు సైతం పెట్టినట్లు తెలుస్తుంది. కూలీల కోరత ఏర్పడుతుండటంతో.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం వ్యవసాయ రంగంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పురుగుమందుల పిచికారీ డ్రోన్లకు మంచి డిమాండ్ ఏర్పడనుంది. కాగా.. వచ్చే నెల నుంచి ద్రోణి డ్రోన్లు మార్కెలు అందుబాటులోకి రానున్నాయి. ఈ గరుడ ఏరోస్పేస్ కంపెనీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
ఈ ద్రోణి డ్రోన్ లాంచ్ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్ చాలా ఉపయోగం కరంగా ఉంటుందని అన్నాడు. కాగా.. కరోనా సమయంలో తాను కూడా వ్యవసాయం చేసినట్లు ధోని చెప్పాడు. ఈ గరుడు డ్రోన్ వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. కరోనా టైమ్లో చాలా మంది ఇళ్లకు పరిమితం అయ్యారు. పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్న వారు అందులోనే సరదాగా వ్యవసాయం చేస్తూ.. ఆ కష్టసమయాన్ని వెళ్లదీశారు. అలాగే ధోని కూడా కరోనా టైమ్లో వ్యవసాయం చేసి.. అందులోని మాధుర్యాన్ని, కష్టనష్టాలను తెలుసుకుని ఉంటాడు. అందుకే రైతులకు ఉపయోగపడే ఈ స్రేయింగ్ డ్రోన్ల కంపెనీలో పెట్టుబడులు పెట్టాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
MS Dhoni launches Made-in-India camera drone ‘Droni’
Dhoni is brand ambassador of Garuda Aerospace, a company that attempts to offer drone solutions for agricultural pesticide spraying, solar panel cleaning, industrial pipeline inspections, mapping etchttps://t.co/8c9o68vuOR
— Amrita Bhinder 🇮🇳 (@amritabhinder) October 10, 2022