ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా.. దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టీ20ల సిరీస్ కి రెడీ అయిపోయింది. బుధవారమే (సెప్టెంబరు 28) తిరువనంతపురం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇరుజట్ల ఆటగాళ్లు… ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీసులో మునిగితేలుతున్నారు. గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భారత జట్టు ఓడిపోతుంది.. మన దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ జోస్యం చెప్పారు. అందుకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. దీంతో ఈ విషయం కాస్త అభిమానుల మధ్య చర్చకు దారితీసింది.
All set for the #INDvSA T20I series. 👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/UR4erC0zP4
— BCCI (@BCCI) September 27, 2022
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా సిరీస్ లో ఆకట్టుకున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యతో పాటు బౌలర్ భువనేశ్వర్ కి విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో పంత్, హర్షదీప్ ని జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య లేకపోవడం జట్టుకు తీరని లోటు అని, రోహిత్ సేనకు తొలి మ్యాచులో పరాజయం తప్పదని జోస్యం చెప్పాడు. మార్కరమ్, డికాక్ ఉండటంతో ప్రత్యర్థి జట్టు బలంగా కనిపిస్తుందని, వారే గెలుస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
‘చివరిసారిగా దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడికి వచ్చినప్పుడు మార్కరమ్ లేడు. డికాక్ ఒక్క మ్యాచే ఆడాడు. అందుకే ఆ జట్టు అప్పుడు బలహీనంగా కనిపించింది. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో ఉన్నారు. ఇక టీమిండియా విషయానికొస్తే.. హర్దిక్ పాండ్య జట్టులో లేకపోవడంతో కాస్త బలహీనపడింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోతుంది. హార్దిక్ లేకపోవడం అనేకాదు డెత్ ఓవర్లలో మన బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. భువీ ఈ మధ్య ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. ఈ సిరీస్ కు అతడు దూరంగా ఉన్నా కానీ తర్వాత ఎలా ఆడతాడనేది చూడాలి. ఇక హర్షల్ పటేల్ విషయంలోనూ అదే జరుగుతోంది’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ పై అభిమానుల ప్రేమ.. మైదానం ముందు భారీ కటౌట్!