మన హైదరాబాద్ లో భారత్-ఆస్ట్రేలియా టీ20.. మూడేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ అనేసరికి.. తెలుగు క్రికెట్ అభిమానులు తెగ సంబరపడిపోయారు. టికెట్ కొనేద్దాం… స్టేడియంలో మ్యాచ్ చూసేద్దాం.. మొబైల్లో స్టేటస్ పెట్టేద్దాం.. ఛాన్సు దొరికితే ఎవరైనా క్రికెటర్లతో ఫొటో దిగేద్దాం.. ఇలా ఫ్యాన్స్ చాలా ఊహించేసుకున్నారు. కట్ చేస్తే ఫొటో కాదు కదా కనీసం టికెట్ కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీనంతటికి కారణం ఏంటా అని ఆలోచిస్తే… అప్పుడు అర్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గురించి తెలిసి కూడా టికెట్స్ దొరికేస్తాయని ఎలా అనుకున్నాంరా బాబు అని ఫ్యాన్స్ తెగ తిట్టుకుంటున్నారు. ఇంతకీ హెచ్సీఏ ఎందుకిలా చేస్తోంది?
HCA sucks!! No official statements no reply to crowd….not even answering police! Finally after breaking the gates the officials start saying tickets will be issued tomorrow…good support from @hydcitypolice #INDvsAUS #HCA #hyderabadtickets @allaboutcric_ pic.twitter.com/XxPvnZ232c
— Karthikinguva (@karthikinguva18) September 21, 2022
హైదరాబాద్ క్రికెట్ అనగానే వీవీఎస్ లక్ష్మణ్, అజహరుద్దీన్ లాంటి అద్భుతమైన క్రికెటర్లు గుర్తొస్తారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వీళ్లు.. తెలుగు ఆటగాళ్ల సత్తా ఏంటో చూపించారు. కానీ.. వీళ్ల తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్కరంటే ఒక్క ప్లేయర్ కూడా జాతీయ జట్టులోకి వెళ్లలేదు. ఇక అంబటి రాయుడు లాంటి అద్భుతమైన ఆటగాడికి మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఎంత మాత్రం సపోర్ట్ లభించిందో అందరికి తెలుసు.హెచ్సీఏ ఎప్పుడో అవినీతిమయం అయిపోయిందని రాయుడు అప్పట్లో సంచలన కామెంట్స్ చేయడం అందరికి గుర్తుండే ఉంటుంది. ఇలా.. హెచ్సీఏ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది.
నిజానికి 1934లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించగా.. తొలుత లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియం హోమ్ గ్రౌండ్ గా ఉండేది. 2005 కల్లా అదికాస్త ఉప్పల్ స్టేడియానికి మారింది. అప్పటి నుంచి పలు అంతర్జాతీయ వన్డే, టెస్టులు ఈ మైదానంలో నిర్వహిస్తూ వచ్చారు. చివరగా అయితే 2019 మార్చిలో భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే జరిగింది. 2018 అక్టోబరులో భారత్-వెస్టిండీస్ మధ్య టెస్టు జరిగింది. రెండింటిలోనూ మన జట్టే గెలిచింది. ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ రావడంతో అస్సలు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు. రెండేళ్ల నుంచి ఐపీఎల్ మ్యాచులు కూడా లేవు.
ఇలా తెలుగు క్రికెట్ ప్రేమికులు.. హైదరాబాద్ మైదానంలో మ్యాచ్ చూసి చాన్నాళ్లయింది. దీంతో ఎప్పుడెప్పుడు మ్యాచ్ జరుగుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుతతోనే ఉన్నారు. వాళ్ల కోసమా అన్నట్లు భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో చివరి మ్యాచ్ ని ఇక్కడే నిర్వహిస్తామని ప్రకటించారు. దానితో పాటు టికెట్స్ ని సెప్టెంబరు 15న ఉదయం 11 గంటలకు పేటియం యాప్ ద్వారా విక్రయిస్తామని హెచ్సీఏ పేర్కొంది. ఇది జరిగిన కాసేపటికే ఉదయం కాదు రాత్రి 8 గంటలకు అన్నారు. తీరా ఆ సమయానికి చూస్తే వివరాలు కనిపించలేదు. రాత్రి 10 గంటలకు లింక్ అందుబాటులోకి వచ్చింది. సరే అని ఓపెన్ చేస్తే, అప్పటికే టికెట్స్ అమ్ముడుపోయినట్లు చూపించారు. దీంతో అభిమానులు షాక్ తిన్నారు. ఏదో కిరికిరి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.
To
The Honourable
President of
Hyderabad cricket association.
HyderabadRespected sir , we are unable to booked tickets for upcoming t20 match against India vs Australia on 25th September 2022. Paytm insider quota full.
— Shaik muzakkar (@ShaikMuzakkar) September 16, 2022
దీనితోపాటు ఆఫ్ లైన్ టికెట్స్, స్టేడియం దగ్గర అమ్ముతామని హెచ్సీఏ అనౌన్స్ చేసింది. దీంతో వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు మైదానం దగ్గరకు చేరుకుని కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లో నిలబడ్డారు. గత మూడు రోజుల నుంచి ఇదే తంతు జరుగుతుంది. అయినాసరే హెచ్సీఏ కనీసం పట్టించుకోలేదు. ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి కూడా నగదు రిఫండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వివాదం కాస్త పెరిగి పెద్దదయ్యేలా కనిపిస్తోంది. హైకోర్టు న్యాయవాది సలీం.. హెచ్సీఏపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. టికెట్లు అక్రమంగా బ్లాక్ లో అమ్ముతున్నారని, ఈ ఘటనపై విచారణ జరపాలని ఆయన కమిషన్ ని కోరారు.
కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ప్రస్తుత అధ్యక్షుడి అజహరుద్దీన్ పై.. హెచ్సీఏలోని వారే ఆరోపణలు చేశారు. అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ వివాదం చల్లారినట్లు కనిపిస్తున్నా సరే.. టికెట్స్ విషయంతో అది మరోసారి వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు రాష్ట్ర క్రికెటర్ల ఎంపికలో సరైన విధానం పాటించకపోవడం, సొంత వారికి ఛాన్సులు ఇస్తుండటం.. ఇలా అసోసియేషన్ పై చాలా ఆరోపణలు వస్తున్నాయి. అసలే ఎప్పుడో ఓసారి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ మ్యాచులు జరుగుతుంటాయి. ఆ సమయంలోనూ టికెట్స్ బ్లాక్ లో అమ్మడం లాంటివి చేస్తే హెచ్సీఏ పరువు పోవడమే కాదు, భవిష్యత్తులో ఇంటర్నేషనల్ మ్యాచులు కూడా జరిపే అవకాశాన్ని హెచ్సీఏకి బీసీసీఐ ఇవ్వకపోవచ్చు. మరి హెచ్సీఏ, అభిమానులతో వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: తీరుమారని టీమిండియా.. మళ్లీ ఆ తప్పులే కొంపముంచాయి..
@hycricket_HCA this is utter negligence . No intimation about tickets till now. people gathered from 5AM #hyderabadtickets#INDvsAUS pic.twitter.com/PZ5x4MWHDW
— Raviteja Vemula (@RavitejaRaVs38) September 21, 2022
It’s getting violent at @hycricket_HCA finally no tickets today but people here are not in a mood to go back home bare handed#INDvsAUS #hyderbadtickets pic.twitter.com/fpYpp3qscm
— Raviteja Vemula (@RavitejaRaVs38) September 21, 2022