క్రికెట్ లో ఐసీసీ ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టనుంది. మహిళలకు సమానత్వాన్ని కల్పిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఫుట్ బాల్, టెన్నిస్ తర్వాత అంతలా పాపులారిటీ సంపాదించుకున్న క్రీడా ఏదైనా ఉందంటే అది క్రికెట్. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న క్రికెట్ లో పురుషులతో పాటు మహిళల మ్యాచులకు కూడా మంచి ఆదరణ ఉంది. అయితే పురుషులతో పోల్చుకుంటే మహిళల క్రికెట్ చాలా తక్కువ క్రేజ్ ఉన్న మాట వాస్తవం. కానీ ఉమెన్స్ ని ప్రోత్సహిస్తూ, పురుషులతో వారికి సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ఐసీసీ ఒక కొత్త అధ్యనాన్నికి తెరలేపింది. ఇకపై పురుషులతో పాటుగా మహిళలకు కూడా సమాన ప్రైజ్ మనీ ఇస్తున్నట్లుగా ప్రకటించేంచింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.
పురుషుల క్రికెట్ టీంకి, మహిళల క్రికెట్ టీంకి ఇకపై ఎలాంటి తేడాలు, పక్షపాతం ఉండదు. ఇక నుంచి ఐసీసీ దృష్టిలో రోహిత్ శర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ ఇద్దరు ఒక్కటే. ఈ ఏడాది టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిస్తే కెప్టెన్ రోహిత్ శర్మకి ఎంత వస్తుందో హర్మాన్ ప్రీత్ కౌర్ కి అంతే వస్తుంది. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లో కూడా పురుషులకి దక్కే ప్రైజ్ మనీ దక్కనుంది. ఇక పార్టిసిపేషన్ ఫీజ్ విషయంలో కూడా తేడాలుండవని ఐసీసీ తెలిపింది. ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో కొన్నేళ్ల క్రితం నుంచే ఈ సమానత్వాన్ని అమలు చేస్తున్నారు. క్రికెట్ విషయంలో కూడా ఇటీవలే ఈ చర్చ జరగ్గా.. తాజాగా గురువారం పురుషులకి, మహిళలకి ఒకటే ప్రైజ్ మనీ అందనుందని అధికారికంగా ప్రకటించింది. మరి ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
JUST IN: Equal prize money announced for men’s and women’s teams at ICC events.
Details 👇
— ICC (@ICC) July 13, 2023