అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ అట్టహాసంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. టోర్నీ మొదలైన తొలి మ్యాచ్ నుంచే సంచలనాలు నమోదవుతున్నాయి. తొలి మ్యాచులో ఆతిథ్య దేశం ఖతార్, ఈక్వెడార్ చేతిలో ఓటమి పాలవగా, ఇప్పుడు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న అర్జెంటీనా, సౌదీ అరేబియా చేతిలో ఓడింది. వార్ వన్ సైడ్ అనుకున్న మ్యాచులో 2-1తో తేడాతో మెస్సీ సేన ఓటమి పాలైంది.
ఫిఫా వరల్డ్ కప్ లో సంచనలం నమోదయ్యింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా చెప్పుకొనే అర్జెంటీనా, సౌదీ అరేబియా చేతిలో ఓడింది. పెనాల్టీ కిక్ ను గోల్ గా మలిచిన లియోనల్ మెస్సీ తొలి అర్ధభాగంలో అర్జెంటీనాను ఆధిక్యంలో నిలిపాడు. అయితే రెండో అర్ధభాగంలో ఆట ప్రారంభమైన వెంటనే 48వ నిమిషంలో సౌదీ అరేబియా ఆటగాడు సలేహ్ అల్-షెహ్రీ గోల్ వేయడంతో 1-1 తేడాతో స్కోర్ సమమైంది. మరోసారి 53వ నిమిషంలో సలేం అల్-దవ్సరీ గోల్ వేయడంతో సౌదీ అరేబియా 2-1తో తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆపై ఆట ముగిసేవరకు అర్జెంటీనా గోల్ వేయడంలో విఫలమవడంతో ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచులో గోల్ మలచడంతో మెస్సీ నాలుగు ఫిఫా వరల్డ్ కప్స్ గోల్స్ చేసిన తొలి అర్జెంటీనా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2006, 2014, 2018, 2022లో మెస్సీ గోల్స్ కొట్టాడు.
¡SORPRESA EN LA #CopaMundialFIFA! ¡#KSA venció a #ARG! 🤯 pic.twitter.com/AqCxacDE5W
— Copa Mundial FIFA 🏆 (@fifaworldcup_es) November 22, 2022
¡Lo ganó #KSA ante #ARG (2-1) y así lo vivió la TV árabe! #FIFAWorldCup
— Marcelo Burgos (@marceloburgosf) November 22, 2022
2006 ✅
2014 ✅
2018 ✅
2022 ✅Leo Messi scores in his fourth World Cup 💥 pic.twitter.com/Mp4lszizc4
— B/R Football (@brfootball) November 22, 2022