క్రికెటర్లే కాదు ఆటగాళ్లు ఎవరైనా సరే మైదానంలో చాలా చురుగ్గా ఉంటారు. అలా ఉండాలి కూడా. లేకపోతే అవతలి జట్టు గెలిచేస్తుంది. అంతవరకు మనం పడిన కష్టం వృథా అయిపోతుంది. పొరపాటు వల్ల అవతల జట్టు లాభపడింది అంటే సరే గానీ.. మన బద్దకం వల్ల వాళ్ల ప్లస్ అయిందంటే మాత్రం కచ్చితంగా అది మనం చేసిన తప్పే అవుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లోని ఓ క్రికెట్ మ్యాచులో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో లెజెండ్స్ 70 పరుగులతో విజయం సాధించింది. దిల్షాన్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టుని గెలిపించాడు. ఈ విషయం పక్కనబెడితే.. బంగ్లాదేశ్ ఫీల్డర్ బద్దకానికి ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బంతి దొరికితే త్రో చేయాల్సింది పోయి అలానే నిల్చుండిపోవడం జట్టు నష్టం చేకూర్చింది. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు.. ఒక్క పరుగు రావాల్సిన చోట ఏకంగా నాలుగు పరుగులు చేశారు.
లంక ఇన్నింగ్స్ లో ఓ బ్యాటర్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్ కి తగిలిన బంతి.. వెనకవైపు వెళ్లిపోయింది. ఆ లోగా అక్కడికి వచ్చిన థర్డ్ మన్ ఫీల్డర్.. బంతి అందుకున్నా సరే విసరకుండా ఉండిపోయాడు. అప్పటికే లంక బ్యాటర్లు రెండు పరుగులు పూర్తి చేశారు. మూడో పరుగుకి ప్రయత్నించారు. టెన్షన్ లో సదరు ఫీల్డర్ సరిగా త్రో వేయలేకపోయాడు. దీంతో బంతి మరోసారి మిస్ అయింది. అలా లంక బ్యాటర్లు మరో పరుగు పూర్తి చేశారు. మొత్తంగా ఒక్క పరుగు రావాల్సిన చోట ఏకంగా నాలుగు పరుగులు వచ్చేశాయి. ప్రస్తుతం ఈ సిరీస్ లో ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సెమీస్ చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబరు 1న జరగనుంది. మరి బంగ్లా ఫీల్డర్ల బద్దకం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Oh they ran four 😃 TM Dilshan & Mahela Udawatte during the legends game vs Bangladesh pic.twitter.com/GQbcOilJ1n
— Nibraz Ramzan (@nibraz88cricket) September 28, 2022