Buddha Venkanna: ఏపీలో అంతంతమాత్రంగానే ఉన్న.. టీడీపీలో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండగా.. గెలుపుపై దృష్టి పెట్టాల్సిన నేతలు.. వారిలో వారు పోట్లాటలతో, మాటల యుద్ధం చేసుకుంటూ.. అధిపత్యం కోసం కొట్టుకుంటున్న తీరు చూసి టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు తాజాగా ఇదే రకమైన అనుభవం ఎదురైంది. పార్టీలో తనను కావాలనే పక్కకు పెడుతున్నారని.. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోయారు. ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వెళ్లిపోవడం తాజాగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇంతకు ఏం జరిగింది అంటే.. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బుద్ధా వెంకన్న బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తనకు ఆలస్యంగా తెలియ జేయటంతో పాటు, తాను రాకుండానే సమావేశాన్ని ప్రారంభించారని.. అంతేకాక వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్ లో తన ఫోటోలు లేకపోవడంతో బుద్ధా వెంకన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. బుద్ధా వెంకన్నకు టీడీపీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని.. తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారతారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. అలాంటిదేం లేదని కొట్టి పారేశాడు. ఈ క్రమంలో సుమన్ టీవీ జర్నలిస్ట్ జాఫర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కన్నీరు పెట్టుకోవడానికి గల కారణాలు వివరించారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని తలచుకుని కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపారు.
అలానే కేశినేని నాని కారణంగా తాను బాధపడ్డ సందర్భాన్ని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ జాఫర్ ‘‘ మీ ఇంటి దగ్గర ఆక్రమిత ప్రదేశంలో ఓ గోడ కట్టారు. ఆ స్థలం మీది కాదని మున్సిపాలిటీ వాళ్లు ఆ గోడ కట్టారు. దానికి కేశినేని నానే కారణమని మీరు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి వాస్తవం కాదా?’’ అని బుద్ధా వెంకన్నను ప్రశ్నించారు. దానికి బుద్ధా వెంకన్న సమాధానం ఇస్తూ.. ‘‘దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. అది ఆయన కట్టించాడని మాత్రం నాకు ఓ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు. ఆయన గొడవ చేసి కట్టించాడని. అంత వరకు మాత్రం నా దృష్టికి వచ్చింది. నేను నా మిత్రుల దగ్గర, వాళ్ల దగ్గర చెప్పి బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు దగ్గర నేను కంప్లైంట్ చేయలేదు. కానీ, మా పార్టీ నాయకుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశా. నేను బాధపడ్డా. ఎందుకంటే..
నేను ఉన్న ఇళ్లు గజం మూడు లక్షల రూపాయలు పలుకుతుంది. ఆ గోడ వల్ల లక్ష రూపాయలకు పడిపోయింది. అది ఎవరి కన్నా లాసే కదా. కారు రావాలన్నా ఇబ్బందే. అది స్థలం కాదు.. రోడ్డు. 60 అడుగుల రోడ్డు.. 15 అడుగులు అయ్యింది. రోడ్డు మీద గోడ కట్టారు’’ అని అన్నారు. మరి, జర్నలిస్ట్ జాఫర్తో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Andhra Pradesh: దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తోన్న ఏపీ విద్యా వ్యవస్థ!