తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత కేఎల్ పాల్ సమక్షంలో ఆయన పీఎస్పీ కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా గద్దర్ కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరి అందరికీ షాకిచ్చారు. అలాగే గద్దర్ వచ్చే నెలలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం పోటీ చేయనున్నట్లు కేఎల్ పాల్ ప్రకటించారు. ప్రజాశాంతి అభ్యర్థిగా గద్దర్ను ప్రకటించి సంచలనం సృష్టించారు.
ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 2న శాంతి సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. నిరసనగా కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షను గద్దర్ పాల్కు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం.. కేఏ పాల్ గద్దర్కు కండువా కప్పి ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా, తెలంగాణ సమాజాన్ని తన పాటతో చైతన్యపర్చిన గాయకుడిగా ఉన్న గద్దర్.. కొంత కాలంగా తన పంథా మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం, ప్రధాని మోదీ సభకు హాజరవ్వడం, కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్కు వెళ్లడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతారనే గుసగుసలూ వినిపించాయి.. కానీ.. ఎవరి ఊహకు అందని విధంగా ఆయన కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీలో చేరారు.
శాంతి శాంతి శాంతి…#gaddar joined in #prajaShanthiParty pic.twitter.com/KNK4gVeg0L
— HEMA NIDADHANA (@Hema_Journo) October 5, 2022
Eyana gaddar yena ? Gaddar & errabelli ki crossbreed la unnadu. pic.twitter.com/Qk0gv3jtGE
— Bannu (@bannurjy) October 5, 2022