హార్డ్కోర్ వైసీపీ నాయకుడు, సీఎం జగన్ వీరాభిమాని అయిన కమెడియన్, థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ.. జగన్ సహా ఆ పార్టీ నాయకులు మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం ఆయన జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తాజా ఇంటర్వ్యూలు, లేటెస్ట్ వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. పృథ్వీ ఇంకా పవన్ కళ్యాణ్ని కలవలేదు.. ఆ పార్టీలో చేరలేదు.. కానీ ఆయన మాత్రం అప్పుడే జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది.. తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో.. ఆ భీమవరం నుంచే తాను బీఫామ్ తీసుకుని.. వైసీపీని ఓడిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు పృథ్వీ.
ఆయన మాట్లాడుతూ.. ‘2019లో చేసిన పొరపాటు 2024లో రిపీట్ కాకూడదు. ఈసారి భీమేశ్వరస్వామి సాక్షిగా అనూహ్యమైన ఫలితం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచితీరతారు. ఇది మేం రాసిస్తాం అని ఘంటాపథంగా ప్రజలుచెప్తున్నారు. ఈ ప్రభుత్వం మారాలని ప్రజలు అనుకుంటున్నారంటే.. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నట్టే లెక్క. ఇందులో సందేహం లేదు’’ అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Adimulapu Suresh: మరో సారి అస్వస్థతకు గురైన మంత్రి ఆదిమూలపు సురేశ్.. మార్నింగ్ వాక్ చేస్తూ కుప్పకూలిన మంత్రి!
‘‘ఈసారి నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా.. బీఫామ్ తీసుకుని నిలబడతా. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు దెబ్బ తిన్నారో.. అక్కడే పోటీ చేసి.. హిస్టరీ రిపీట్ అని డైలాగ్ కొడతా. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మేం కేవలం డైలాగ్లు మాత్రమే చెప్పడం లేదు.. ఏం జరగబోతుందని గ్రౌండ్ లెవల్ నుంచి వర్క్ చేసి మరీ చెప్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కేవలం జనసేనకు మాత్రమే కలిసి వస్తుంది. టీడీపీకి అవకాశం ఉండదు. బాల్ మా కోర్టులో ఉంది. ఈసారి వన్ సైడ్ లవ్లు ఉండవు. ప్రజలు జనసేనవైపు మాత్రమే ఉంటారు’’ అని ధీమా వ్యక్తం చేశారు కమెడియన్ పృథ్వీ. మరి ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Amaravati Lands: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకానికి అమరావతి భూములు.. ధర కోట్లలో!