ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన గతంలో ఎంత నరకంగా సాగిందో అందరికీ తెలిసిందే. దీంతో.., ఈసారి మొదటిరోజు నుండే దేశం వదిలి వలస పోవడానికి ఆఫ్ఘన్ వాసులు క్యూ కట్టారు. ఇందులో భాగంగా కాబూల్ విమానశ్రయం జనంతో కిక్కిరిసి పోవడం, అక్కడి విమానాలు ఎయిర్ బస్ లను తలపించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే అమెరికా ఎయిర్ఫోర్స్కు చెందిన విమానం టైర్లను పట్టుకొని వెళ్లడానికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులు కింద పడి మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.., అంత అమాయకంగా ప్రాణాలను పోగొట్టుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరన్న విషయం ఇపుడు బయటకి వచ్చింది.
విమానం టైర్లను పట్టుకొని వేలాడుతూ పైకి వెళ్లి.., అక్కడ నుండి కింద పడిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వీరు 17 ఏళ్ల రెజా, 16 ఏళ్ల కబీర్. వీరిలో రెజా మృతదేహం ఎయిర్పోర్ట్కు దగ్గరలోని ఓ భవనంపైన లభించింది. కానీ.., కబీర్ మృతదేహం మాత్రం ఇంకా లభ్యం కాలేదు. అంత పై నుండి కిందపడ్డ రెజా కాళ్లు, చేతులూ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయట. ఈ త్రీవ్రతని బట్టి కబీర్ కూడా చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు ఓ నమ్మకానికి వచ్చేశారు.
అమెరికాలోకి ముందుగా వచ్చిన 20 వేల మంది ఆఫ్గన్లకు మాత్రమే.. అమెరికా ఆశ్రయమిస్తున్నట్లు ఎవరో ఓ అబద్దపు వార్త చెప్తే.., దాన్ని నమ్మిన ఈ అన్నదమ్ములు ఇలా అమాయకంగా విమానం టైర్లు పట్టుకుని వ్రేలాడుతూ పైకి వెళ్లారట. ఇక వీరితో పాటు.., విమానం పై భాగానికి వెక్కిన మూడో వ్యక్తి.. కాబూల్ లో స్థానికంగా చిన్న బట్టల షాప్ ని నడిపే దుకాణదారుడుగా తెలుస్తోంది. ఇతని మృతదేహం కూడా ఇప్పటి వరకు కనిపించలేదు. మరి.., ఇంత అమాయకంగా ఆలోచించి ప్రాణాలను పోగొట్టుకున్న వీరిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
DISCLAIMER: DISTURBING FOOTAGE❗️❗️❗️
Two people who tied themselves to the wheels of an aircraft flying from Kabul, tragically fall down. pic.twitter.com/Gr3qwGLrFn— Tehran Times (@TehranTimes79) August 16, 2021