ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కంటికి దూరమైతే ఆ కుటుంబం పడే ఆవేదన అంతాఇంతా కాదు.
ఈ మద్య కాలంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కంటికి దూరమైతున్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు మరణాలు, అగ్ని ప్రమాదాలు కారణాలు ఏమైనా.. కుటుంబ సభ్యులకు తీరని దుఖఃం మిగుల్చుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ భవనంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో నలుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న నలుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. పేలుడు శబ్ధానికి చుట్టుపక్కల జనాలు ఒక్కసారే ఉలిక్కి పడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే భవనంలో ఎక్కువ శాతం చెక్కతో ఉండి ఉండటం వల్ల మంటలు భారీగా ఎగసిపడ్డాయని అధికారులు అంటున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
డెహ్రాడూన్ తునిలో రామ్ జోషీకి చెందిన నాలుగు అంతస్థుల భవనం ఉంది. ఇందులో రామ్ జోషితో పాటు ఐదు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించి పెద్దవాళ్లు అక్కడ నుంచి తప్పించుకున్నారు. అదే సమయంలో సమయంలో నలుగురు చిన్న పిల్లలు భవనం లోపలే చిక్కుకు పోయారు. చనిపోయిన పిల్లలు జైలాల్, వివేక్, త్రిలోక్, అధిరా లుగా గుర్తించామని.. వీరితో పాటు విక్క చౌహాన్, భగత్, కుసుమమ్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంటలు కుసుమమ్ ఆర్పేందుకు ప్రయత్నించిన సమయంలో ఆమె తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కుసుమమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటన తెలిసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
#WATCH | Four people died during a massive fire that broke out in a house last evening near Tuni bridge in Dehradun district. Several fire tenders reached the spot and doused the fire: District administration pic.twitter.com/UUlmIDIFYo
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 7, 2023