ఛత్తీస్గఢ్లో దారుణం చోటుచేసుకుంది. స్కూల్లో స్నేహితులతో కలిసి మెలిసి ఓ బాలుడు ఆడుతుపాడుతూ గడుపుతున్నాడు. అంతలోనే కొందరు యువకులు వచ్చి ఆ బాలుడుని అతి కారతకంగా కత్తులతో పొడిచిన ఘటన రామాభాఠాలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్గఢ్లోని రామాభాఠా ప్రభుత్వ పాఠశాలలో సాగర్ టండన్ అనే బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ప్రతీ రోజులాగే పాఠశాలకు వచ్చి మాధ్యాహ్న భోజనం చేసి అక్కడే తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అంతలోనే ఇద్దరు యువకులు సాగర్ టండన్ను ఓ తరగతిలోకి తీసుకెళ్లారు. అందరూ సాగర్కు తెలిసిన వ్యక్తులేమో అని అనుకున్నారు. కొద్ది సేపటి తర్వతి నుంచి ఆ తరగతి గది నుంచి అరుపుల శబ్ధం వినిపించింది. దీంతో అందరూ వెళ్లి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
ఆ ఇద్దరు యువకులు సాగర్ టండన్ను కొట్టి కత్తిపొడిచి కర్కషంగా హతమర్చారు. దీంతో రక్తపు టేరులో పడిని సాగర్ని చూసి స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసింది. కానీ అతను మధ్యలోనే ప్రాణాలను వదిలాడు. మరి ఆ యువకులు సాగర్ను ఎందుకు చంపారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.