దేశవ్యాప్తంగా ఏటీఎంలో దొంగతనాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. దొంగలు ఏటీఎంల్లో పలు రకాలుగా చోరీకి పాల్పడుతున్నారు. ఏటీఎంలను పగలగొట్టి డబ్బులు దొంగిలించడం, మిషన్ హ్యాక్ చేసి డబ్బులు డ్రా వంటి పద్ధతులతో దొంగలు చోరీలు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు గడచిన రెండేళ్లలో మూడు “ఏటీఎం గ్యాంగ్స్”న్ని పట్టుకున్నారు. ఈ ఏటీఎంలలో చోరీలకు పాల్పడే వారంత హర్యాణా, రాజస్థాన్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.
ఈ గ్యాంగ్ డబ్బు డ్రా చేసే సమయంలో ఏటీఎం మెషీన్ ను ఆపేసి మిగత కథ నడుపుతారు. వీరి దొంగతనం ఒక రకంగా అయితే ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ మాత్రం వీటిని తలదన్నేలా వ్యవహరించింది. ఈ గ్యాంగ్ ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లను హ్యాక్ చేసి పని కానిచ్చింది. ఇటీవల ఆ గ్యాంగ్ లోని అయిదుగురిని పట్టుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ ముఠాకు సాంకేతిక సహకారం అందించింది హైదరాబద్ లోని ఓ యువకుడు అని తేలింది. దీంతో ఆ యువకుడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కు పంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త ఏటీఎంనూ హ్యాక్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఈ ముఠా హైదరాబాద్ వాసి కమల్ను ఏర్పాటు చేసుకుంది. కమల్ ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అక్కడి ఓ పబ్లో ఆ గ్యాంగ్ కి పరిచయమయ్యాడు. కమల్ డార్క్ నెట్ నుంచి ఏటీఎం మెషీన్ల హ్యాకింగ్ సంబంధించిన మాల్వేర్ సమకూర్చుకున్నాడు. కమల్ హైదరాబాద్లోనే ఉండి ఏటీఎం హ్యాక్ పై అధ్యయనం చేసి వాటికి పాస్వర్డ్గా క్రియేట్ చేసేవాడు. దానిని షానవాజ్ గ్యాంగ్కు ఫోన్లో చెప్పేవాడు. కమల్ ఇచ్చిన పాస్ వర్డ్ ని గ్యాంగ్ ఎంటర్ చేసి ఏటీఎం మెషీన్ ను రీబూట్ అయ్యేలా చేస్తారు. ఆ సమయంలో డబ్బు డ్రా చేయడంతో అది ఖాతాదారుడి లెక్కల్లోకి రాదు. ఈ పంథాలో షానవాజ్ గ్యాంగ్ ఢిల్లీ, యూపీ, ఘజియాబాద్ల్లో కొన్నాళ్లుగా 200 ఏటీఎంలను కొల్లగొట్టింది. ఇలా కాజేసినదాంట్లో కమల్కు 5% ఇచ్చేవారు.
గత నెల ఆఖరి వారంలో ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు షానవాజ్ సహా అయిదుగురిని పట్టుకున్నారు. షానవాజ్ ను లోతుగా విచారించిన సైబర్ సెల్ కమల్ వ్యవహారం భయటపడింది. అతడు హైదరాబాద్లో ఉన్నాడని తేలడంతో ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ పంథాలో ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది. సాంకేతికతను మంచికి కాకుండా చెడు కు ఉపయోగిస్తున్న ఇలాంటి వారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.