పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజానీకానికి, వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెట్రోల్పై 8 రూపాయలు, డీజిల్ పై రూ. 6.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు తెలిపింది. తద్వారా పెట్రోల్ పై లీటర్కు రూ. 9.5, డీజిల్పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గనుందని ఆమె తెలిపారు. అలాగే.. ఈ ఏడాది సిలిండర్కు రూ.200 చొప్పున గ్యాస్ సబ్సిడీ సైతం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలోని 9 కోట్ల మంది ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తించనుంది. దీని వల్ల కేంద్రంపై ఏడాదికి రూ.6100 కోట్ల మేర భారం పడుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ఇంధన ధరల తగ్గింపుతో కాస్త ఊరట ఇచ్చిన కేంద్రం.. నిర్మాణ రంగానికి మంచి సంకేతాలు అందించింది. సిమెంట్ ధరలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే దిగుమతి ఆధారిత ఎక్కువగా ఉన్న.. ప్లాస్టిక్ ఉత్పత్తుల ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు ఐరన్, స్టీల్పైనా.. సంబంధిత కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్లు తెలిపారు. అయితే.. కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించబడుతుందని ఆమె స్పష్టం చేశారు.అందుకు సంబంధించిన నోటిఫికేషన్ కాసేపట్లో రాబోతోందని నిర్మలా సీతారామన్ పేర్కున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో దాదాపు రూ.15 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాబడి తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా.
ఒకవైపు కోవిడ్ పరిస్థితులు, మరోవైపు రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా.. ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకులతో దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతేడాది దీపావళి సమయంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ రాష్ట్రాల్లోనూ వ్యాట్ తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే, ఆ తర్వాత కూడా విపరీతంగా ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు రూ. 110, డీజిల్ ధరలు రూ. 100కు చేరుకున్న పరిస్థితుల్లో మరోసారి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
ప్రధానితో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత, పలురకాల అధ్యయనాల సూచనల ఆధారంగా ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. పీఎంవో ఇచ్చిన సూచనలు, ప్రధాని పలువురు నిపుణులతో జరిపిన చర్చల్లో ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం కావడంతో పీఎంవో స్వయంగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
1/12 Our government, since when @PMOIndia @narendramodi took office, is
devoted to the welfare of the poor.We’ve taken a number of steps to help the poor and middle class. As a result, the average inflation during our tenure has remained lower than during previous governments.— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022
7/12 We are reducing the Central excise duty on Petrol by ₹ 8 per litre and on Diesel by ₹ 6 per litre.
This will reduce the price of petrol by ₹ 9.5 per litre and of Diesel by ₹ 7 per litre.It will have revenue implication of around ₹ 1 lakh crore/year for the government.
— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022
9/12 Also, this year, we will give a subsidy of ₹ 200 per gas cylinder (upto 12 cylinders) to over 9 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana. This will help our mothers and sisters. This will have a revenue implication of around ₹ 6100 crore a year. #Ujjwala
— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022
11/12 Similarly we are calibrating customs duty on raw materials & intermediaries for iron & steel to reduce their prices.
Import duty on some raw materials of steel will be reduced.
Export duty on some steel products will be levied.#MSME #iron #steel #Customs #Export
— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022
ఇది కూడా చదవండి: Businessman: కోట్ల ఆస్తిని విరాళంగా రాసిచ్చి.. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన కుటుంబం!