ధనం మూలం ఇదం జగత్ అని ఊరకనే అనలేదు పెద్దలు. ప్రస్తుత కాలంలో ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఏ సంబంధాలైనా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ.. ఆ డబ్బు కోసం చెడు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించడంపై దృష్టి పెడుతూ.. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా బతికేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో క్యాష్ చేసుకుందామనుకున్న ఇద్దరి గుట్టును ముంబయి కస్టమ్ అధికారులు రట్టు చేశారు.
ఈ నెల 22, 23వ తేదీల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే ముంబయి విమానాశ్రయంలో ఆది, సోమవారాల్లో కస్టమ్ అధికారులు తనిఖీలు చేపడుతుండగా.. ఇద్దరు విదేశీ ప్రయాణీకుల కదలికలపై అనుమానం వచ్చింది. వారిద్దరినీ తనిఖీ చేశారు. వారి వెంట తెచ్చుకున్న పుస్తకాలపై వారి దృష్టి పడింది. వాటిని తిరగేసి చూడగా 90 వేల అమెరికా డాలర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు వేర్వేరు ఘటనలు అయినప్పటికీ.. ఈ విదేశీయులిద్దరూ పుస్తకాల్లో డబ్బులు దాచడం గమనార్హం. అంతేకాకుండా వీరి వద్ద నుండి 2.5 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. పేస్ట్ రూపంలో ఈ బంగారాన్ని తీసుకువచ్చారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
#WATCH | Mumbai: On Jan 22 & 23, Mumbai Airport Customs intercepted two foreign nationals in two separate cases and seized 90,000 USD concealed in pages of books and over 2.5 kg of gold in paste form respectively. Both the passengers have been arrested: Customs pic.twitter.com/8Nnh4rR5qg
— ANI (@ANI) January 24, 2023