బీహర్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచీలో రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ లోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే లాలూను దిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్ళనున్నారు. బోర్డు నిర్ణయం కోసమే అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు రిమ్స్లోనే చికిత్స పొందుతున్న ఆర్జేడీ ఎంపీ ఆర్కే రాణాను దిల్లీకి తరలించేందుకు మెడికల్ బోర్డు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల పశువుల దాణ కుంభ కోణం కేసులో దోషిగా తేలి.. ప్రస్తుతం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలం నుంచి రాంచిలోని రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్న చీఫ్ డాక్టర్ విద్యాపాటి.. దిల్లీలోని ఎయిమ్స్కు తరలించాలని సూచించారు. ఈ విషయంపైనే రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమైంది. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత లాలూను దిల్లీ ఎయిమ్స్కు తరలించే అవకాశం ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.