గత కొంత కాలంగా దేశంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ, రాజకీయ నాయకులు వరుసగా కన్నుమూస్తున్నారు. ప్రముఖ ఆదివాసీ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ (83) కన్నుమూశారు. భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు హేమానంద బిస్వాల్ మరణవార్తను ఆయన కుమార్తె సునీతా బిస్వాల్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ ఒడిశా జిల్లాల్లో ప్రముఖ ఆదివాసీ నేత అయిన బిశ్వాల్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించారు.
హేమానంద బిస్వాల్ ఒడిశా ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. బిస్వాల్ డిసెంబర్ 7, 1989 నుంచి మార్చి 5, 1990 వరకు మొదటి సారి సీఎం కుర్చీని అధిరోహించగా.. డిసెంబర్ 6, 1999 నుంచి మార్చి 5, 2000 వరకు రెండవసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. బిస్వాల్ జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.
ఇది చదవండి: అఖండ కోసం సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరిన బాలయ్య
బిస్వాల్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బిశ్వాల్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఒడిశా గవర్నర్ ఆచార్య గణేశీలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్, పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. ఆయన మృతి ఒడిశా రాజకీయాలకు తీరని లోటని అన్నారు.
Former Chief Minister of Odisha Hemananda Biswal passed away in Bhubaneswar today
— ANI (@ANI) February 25, 2022