రాజకీయ రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రజల కోసం నిరంతరం నడిచిన పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీరామ రెడ్డి(75) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. CPM తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేవారు. అందుకే రెండు పర్యాయాలు ప్రజలు సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిపించారు.
బాగేపల్లిలోని తన నివాసం ఉంటున్న శ్రీరామరెడ్డి ఇటీవల మోకాలకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా శుక్రవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందనట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాగేపల్లిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జీవీ శ్రీరామరెడ్డి పార్థివదేహాన్ని దర్శనార్ధంకోసం ఉంచనున్నారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేశారు.కర్నాటక మంత్రి డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్యే సుబ్బారెడ్డి, నిడుమామిడి పీఠాధ్యక్షుడు వీరభద్ర చెన్నమల్ల మహా స్వామీజీ, మాజీ కేంద్ర మంత్రి మునియప్ప, ఎమ్మెల్యేలు రమేష్ కుమార్, కే.శ్రీనివాస్గౌడ,హెచ్.ఎన్.శివశంకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.సంపంగి, డాక్టర్ ఎం.సి.సుధాకర్, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జీవీకి ఘన నివాళి అర్పించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.