భారతదేశంలోని అతిముఖ్యమైన నగరాల్లో చెన్నై నగరం ఒకటి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఈ నగరం కలిగి ఉంది. ఇప్పటికే ఎన్నో ఘన కీర్తులతో చరిత్రలో నిలిచిన చెన్నై నగరం మరోసారి వార్తలో నిలిచింది. అందుకు కారణం ఆ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్.
భారత దేశంలోని అతిముఖ్యమైన నగరాల్లో చెన్నై నగరం ఒకటి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఈ నగరం కలిగి ఉంది. ఇప్పటికే ఎన్నో ఘనకీర్తులతో చరిత్రలో నిలిచిన చెన్నై నగరం మరోసారి వార్తలో నిలిచింది. అందుకు కారణం ఆ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్. సరికొత్త హంగులతో చెన్నై విమానాశ్రయంలోని కొత్త టెర్నినల్ ను నిర్మించారు. ఈ టెర్మినల్ భవనంలో తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేకమైన డిజైన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఈ ఎయిర్పోర్టులో కల్పించారు. దగదగలాడిపోతున్న చెన్నై విమానాశ్రయ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న ప్రారంభించనున్నారు.
తమిళనాడు చెన్నై విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభంకానుంది. దీని మొదటి దశను ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్లో 2,20,972 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం ప్రారంభం కానుంది. తమిళనాడు రాష్ట్రంలో పెరుగుతున్న విమాన ట్రాఫిక్ను సమస్యను తగ్గించడానికి ఈ కొత్త టర్నినల్ సిద్ధమైంది. ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ టర్నినల్ నిర్మాణం ప్రయాణీకులకు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిబింబంగా ఉండనుంది అధికారులు తెలిపారు.
ఈ నిర్మాణం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. “చెన్నై మౌలిక సదుపాయాలకు ఇది ఒక ముఖ్యమైనది. ఇది కనెక్టివిటీని పెంచుతుంది, అలానే స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంద” అని మోదీ ట్విట్టర్లో రాశారు. ప్రస్తుతం చెన్నై విమానాశ్రయంలోని కొత్త టర్మినల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ఇది ఎయిర్పోర్టా.. భూలోక ఇంద్ర భవనమా..?” అంటూ ఈ ఫిక్స్ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. దృశ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This will be an important addition to Chennai’s infrastructure. It will boost connectivity and also benefit the local economy. https://t.co/lWMBMmvvRU
— Narendra Modi (@narendramodi) April 6, 2023