హైదరాబాద్- తన కుమారుడు హిమాన్షును ఉద్దేశిస్తూ బీజేపీనేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్పై ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యానాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణలో మీ బీజేపీ నేతలకు నేర్పిస్తున్నది ఇదేనా? నా కుమారుడి శరీరాకృతిపై బీజేపీ ప్రచారకర్తలు అసహ్యమైన రాజకీయవ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా? అమిత్ షా లేక ప్రధాని మోదీలతోపాటు వారి కుటుంబాన్ని ఉద్దేశించి మేమూ మీలాగే మాట్లాడలేమనుకుంటున్నారా? ప్రజాజీవితంలో ఉండటం సరైనదేనా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది’’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్
‘బీజేపీ ప్రచారకర్తల ముసుగులో ఉన్న దిగజారుడు నేతలకు, అలాంటి నేతలకు ప్రాచుర్యం ఇచ్చే మీడియాకు దూరంగా ఉండండి. ప్రత్యేకించి నా పిల్లల మీద నేరస్వభావం కలిగిన చెత్తవ్యాఖ్యలు చేస్తున్నతీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మేం కూడా అదేస్థాయిలో స్పందించాల్సిన స్థితి వస్తే మమ్ము లను నిందించొద్దు’అని రాష్ట్రమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sri @JPNadda Ji,
Is this what you teach BJP leaders in Telangana? Is it Sanskar to drag my young son & body shame him through ugly political comments in BJP’s mouthpiece?
You don’t think we could reciprocate in the same coin against Amit Shah Ji’s or Modi Ji’s family? https://t.co/hHlXC99r1v
— KTR (@KTRTRS) December 24, 2021