పిల్లలకు జలుబు, దగ్గు చేసిందని పెద్ద కంపెనీ మెడిసిన్ అని తీసుకొచ్చి వేసిన తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. ఆ మందు ఏకంగా 66 మంది పసిపిల్లలను బలి తీసుకుంది. అది కూడా భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన మందుతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల్లో గాంబియాలో 66 మంది పిల్లలు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి చెందిన దగ్గు, జలుబు మందులు తాగి మరణించారు. దీంతో ఈ కంపెనీకి చెందిన నాలుగు రకాల మందులను వాడొద్దని డబ్ల్యూహెచ్ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఆదేశించింది. ఆఫ్రికా దేశాల్లో మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ను ప్రకటించింది. అలాగే ఈ ఘటనపై మైడెన్ కంపెనీపై, అలాగే వాటికి అనుమతులు ఇచ్చిన భారతీయ అధికారులపై కూడా విచారణ జరుపుతామని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.
ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ మందులపై మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ను ప్రకటించింది. ఈ మందులలో మోతాదుకు మించి డైథైలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్లను ఉన్నాయని, వాటితోనే మందులు కలుషితం అయ్యాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కాగా.. నెల రోజుల క్రితమే గాంబియా ఆరోగ్యశాఖా మంతి ఈ మందులను వాడకం నిలిపివేయాలని ఆదేశించారు. అప్పటికే 28 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా పిల్లల మరణాలు ఆగలేదు. ఇప్పటికే మరణాల సంఖ్య 66కు చేరుకోగా.. మరికొంత మంది పిల్లల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఈ మందులను ఆఫ్రికాలో బ్లాక్ మార్కెట్ ద్వారా విక్రయాలు జరిపినట్లు సమాచారం.
Indian Made Cough Syrups Kill 66 Children in Gambia; No Alert From India’s Drug Controller Yet https://t.co/iSCCSDgQzN via @thewire_in
— Banjot Kaur (@Banjotkaur) October 5, 2022
In context of the latest news that DEG adulteration of cough syrup made by an Indian firm killed 66 children in Gambia, here’s my story on the 2020 deaths of 13 children in J&K due to DEG-contaminated medicine. And how such crimes are eminently avoidable https://t.co/wWYeJuftcC
— PriyankaPulla (@PriyankaPulla) October 5, 2022
ఇది కూడా చదవండి: వృద్దుడి కడుపులో గ్లాస్.. నివ్వెరపోయిన వైద్యులు!