సాధారణంగా చిన్న పిల్లలు ఏవి కనిపిస్తే అవి నోట్లో వేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఈ కారణంతోనే సాధ్యమైనంత వరకు తల్లిదండ్రుల ఎప్పుడూ పిల్లలకు రక్షణగా ఏవీ తినకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఇటీవల కొంత మంది కడుపులో చిల్లర నాణేలు, ఇనుప వస్తువులు చూసి వైద్యులు ఒకింత ఆశ్చర్యపడిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొంత మంది అనుకోని పరిస్థితిలో సెల్ ఫోన్ మింగి లబో దిబో అంటూ ఆసుపత్రికి వెళ్లిన ఘటనలు కూడా జరిగాయి. ఈ మద్య నే ఓ వ్యక్తి కడుపు నిండా చెంచాలు ఉండటంతో డాక్టర్లు షాక్ తిన్నారు. ఓ వృద్దుడి కడుపులో గ్లాసు ఉండటం చూసి డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఈ సంఘటన మద్యప్రదేశ్ లో జరిగింది.
మద్యప్రదేశ్ లో ఇటీవల రామదాస్ అనే వృద్దుడు అమావత్ అనే గ్రామానికి వెళ్లగా అక్కడ కొంత మంది అతనిపై అనుమానం రావడంతో కట్టెసి కొట్టారు. అంతేకాదు ఆ వృద్దుడిని ఒక గ్లాస్ పై కూర్చోబెట్టారు. ఈ దారుణమైన శిక్ష అందరి మద్యలో అమలు చేశారు.. ఎవరూ కూడా ఆ వృద్దుడిని ఎవరూ కాపాడలేకపోయారు. అదే సమయంలో ఆ వృద్దుడి కడుపులోకి గ్లాస్ వెళ్లింది. అయితే అంత ఘోరమైన శిక్ష గ్రామస్థులు అతడికి ఎందుకు వేశారో చెప్పలేదు. తనకు పడ్డ శిక్ష గురించి బాధపడ్డాడే తప్ప ఎవరికీ చెప్పుకోలేకపోయాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ వృద్దుడికి తరుచూ కడుపు నొప్పి రావడంతో వైద్యుల వద్దకు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్ రే తీయగా కడుపులో ఉన్న వస్తువు చూసి షాక్ తిన్నారు డాక్లర్లు. ఆ గ్లాసు కడుపులో ఉండటం వల్లనే కడుపు నొప్పి రావడం జరిగిందని అన్నారు. ఆ వృద్దుడికి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న గ్లాస్ తీస్తామని వెల్లడించారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగడం ఎంతో శోచనీయం అని వైద్యులు అన్నారు.
ఇది చదవండి: గ్రామ సచివాలయ వ్యవస్థకు మూడేళ్లు.. ప్రభుత్వం సాధించింది ఇదే!