రెండు రోజులుగా ఇటలీ రాజధాని రోమ్లో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. ఇవాళ వాటికన్ సిటీకి వెళ్లారు. అక్కడ ఆయన పోప్ ఫ్రాన్సిస్తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. 12 ఏళ్లలో రోమ్ కు వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం. ఈ విషయాన్ని ఇటలీకి భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు. కాగా, ఇవాళ ఇటలీ అధ్యక్షతన రోమ్ నగరంలో జీ-20 సదస్సు జరుగనుంది. గ్రూప్లో 20 దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఇటలీ ప్రధాని మరియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కూడా అక్కడికి చేరుకున్నారు. వాటికన్ సిటీ నుంచి రోమ్కు వచ్చిన తర్వాత జీ-20 సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ ఆయన వెంట ఉన్నారు. రేపు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ప్రారంభమయ్యే కాప్-26 సదస్సుకు హాజరుకానున్నారు. కాప్-26 సదస్సు వచ్చే నెల 12 తారీఖున ముగియనుంది.
ఇదిలా ఉంటే.. వాటికన్ సిటీకి చేరుకున్న ప్రధానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పోప్ ఫ్రాన్సిస్తో ప్రధాని భేటీ మర్యాదపూరకంగా మాత్రమే కలిశారు. అయితే ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఎలాంటి అజెండా లేదని ఇదివరకే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
#WATCH Prime Minister Narendra Modi at the Vatican City to meet Pope Francis
He is accompanied by NSA Ajit Doval and EAM Dr S Jaishankar pic.twitter.com/JZiMbXUtLN
— ANI (@ANI) October 30, 2021