సంబంరం అనే సినిమాలో కనిపించి కనిపించనట్లు ఉండే ఈ కుర్రాడు.. కాలగమనంలో పెద్ద హీరో అయ్యాడు. గత ఏడాది..తన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా స్టార్ హోదాను సాధించాడు. ఇప్పుడు అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరంటే..?
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి తమ స్వయం కృషితో ఎదిగారు అనేక మంది నటీనటులు. తొలితరం నుండి ఇప్పటి తరం వరకు ఆ జాబితాను చూస్తే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అయితే ఇప్పటి తరంలో చాలా మంది నటులు తమ తండ్రి వారసత్వాన్ని పుణుకు పుచ్చుకుని సినిమా పరిశ్రమకి వస్తున్న వారే. తమను తాము నిరూపించుకోవాలని తపన పడుతుంటారు. అయితే ఏ మాత్రం సినీ పరిశ్రమతో సంబంధం లేని వాళ్లు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. సినిమా మీద ప్యాషన్ తో అడుగుపెట్టి హీరోలుగా మారి.. తమను తాము ఫ్రూవ్ చేసుకున్న నటులున్నారు. వారిలో నాని, శ్రీ విష్ణు, విజయ్ దేవరకొండ, నితిన్, నిఖిల్. కార్తీకేయ వంటి వారున్నారు. వీరిలో నిఖిల్ సిద్దార్థ్ దారి వేరే. వరుసగా ఫెయిల్యూర్ పలకరించినా.. వెనకడుగు వేయలేదు. తెరపై చిన్న చిన్న క్యారెక్టర్లతో వచ్చి పాన్ ఇండియా స్టార్ హోదా వైపుకు పరుగులు పెడుతున్నాడు.
గత ఏడాది వరుస విజయాలతో దూసుకుపో్యాడు ఈ బేగం పేట కుర్రాడు. కార్తీకేయ 2తో పాటు 18 పేజేస్ సినిమాల విజయాన్ని నమోదు చేశాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కార్తీకేయ 2 పాన్ ఇండియా రేంజ్లో దూసుకు పోయింది. కార్తీకేయ సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఒక్కసారిగా నిఖిల్కు భారీ క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతోనే ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత విడుదలైన 18 పేజెస్ మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా నిఖిల్ అరుదైన గౌరవం లభించింది. ఐకానిక్ గోల్ట్ అవార్డ్స్ 2023లో ఉత్తమ నటుడిగా నిఖిల్ సిద్దార్థ్ అవార్డును అందుకున్నాడు. బెస్ట్ యాక్టర్ ఇన్ పాపులర్ చాయిస్ విభాగంలో అవార్డ్ గెలుచుకున్నాడు. ‘కార్తికేయ2’ చిత్రంలో నటనకు ఈ అవార్డ్ వరించింది.
ఈ విషయాన్నిఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా మూవీ టీంకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాను కృష్ణతత్వాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు. మనిషి ఎలా జీవించాలని శ్రీ కృష్ణుడు బోధించాడని బలంగా చెప్పాడు దర్శకుడు చందు మొండేటి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం నిఖిల్.. స్పై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా ఐదు భాషల్లో రూపొందిస్తున్నారు.
We WON the “Best Actor” Popular Choice for #karthikeya2 on the National Level. Thank u @chandoomondeti for the amazing movie and my producers @AbhishekOfficl bhai @vishwaprasadtg garu and @vivekkuchibotla garu. Thank you @IconicGoldAward for this Honour and Motivation ❤️🔥 pic.twitter.com/NvWPAYnxXh
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 19, 2023