రేషన్ కోసం రేషన్ షాపుల ముందు గంటల తరబడి ప్రజలు పడిగాపులు పడకూడదని భావించిన.. ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు సిద్ధమైంది ఏపీలోని జగన్ సర్కార్ . దీని కోసమని ప్రత్యేకమైన వాహనాలను సిద్ధం చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీ కోసం మినీ వ్యానులు, ఎండీయూ వాహనాలను తీసుకొచ్చింది. అయితే..
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం, ఇతర సరుకులను కార్డుదారుని ఇంటికే అందించాలని ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేషన్ కోసం రేషన్ షాపుల ముందు గంటల తరబడి ప్రజలు పడిగాపులు పడకూడదని భావించి.. ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు సిద్ధమైంది. దీని కోసమని ప్రత్యేకమైన వాహనాలను సిద్ధం చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీ కోసం మినీ వ్యానులు, ఎండీయూ వాహనాలను తీసుకొచ్చింది. వీటి కోసం కొంత మంది ఉద్యోగులను నియమించింది. దీంతో సౌలభ్యంగా ఇంటి ముందే వాహనాల్లో రేషన్ పొందుతున్నారు జనాలు. కానీ కొంత మంది చేస్తున్న పనుల వల్ల జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డోర్ డెలివరీ కోసం మొబైల్ వాహనాలను సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే వాహనాన్ని తాకట్టు పెట్టి వార్తల్లో నిలిచాడో డ్రైవర్. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మాకవరపాలెం మండలం రాచపల్లి సచివాలయం పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. ఈ సచివాలయ పరిధిలో అదే గ్రామానికి చెందిన రాయవరపు నాగరాజు రేషన్ వాహనికి డ్రైవర్గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి నెల అతడు ఈ వాహనం ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తుంటాడు. అయితే ఈ నెల పంపిణీ జరుగుతున్న క్రమంలోనే అతడు కనిపించకుండా పోయాడు.
అతడి ఆచూకీ లభించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అసలు విషయం తెలిసి.. విస్తుపోవడం వారి వంతైంది. మూడు వారాల కిందట ఈ రేషన్ పంపిణీకి వినియోగించే వాహనాన్ని రామన్నపాలెనికి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ. 40 వేలకు తాకట్టు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. మరో వ్యక్తి వద్ద బైక్ తీసుకుని దాన్ని కూడా తాకట్టుపెట్టాడని తేలింది. ఏకంగా రేషన్ వాహనం తాకట్టు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.