తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో బతుకమ్మ ఒకటి. ఇక్కడి ఆడబిడ్డలు బతుకమ్మ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఆశ్వీయుజ శుద్ధ అమావాస్యనాడు ప్రారంభమైవుతుంది. అలా 9 రోజులపాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి. తెలంగాణ ఆడబిడ్డులు వివిధ రకాల పూలతో బతుకమ్మను ఎంతో అందంగా తయారు చేస్తారు. అక్కాచెల్లెలు అంతా ఒక దగ్గరకు చేరుకుని కలిసి, ఆడి, పాడుతారు. అయితే తాజాగా బతుకమ్మ పండగ సందర్భంగా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు యాంకర్లు, ఇతర సీనియర్ నటీమణులు కూడా బతుకమ్మ పాటలో చక్కటి అభినయం ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“తలకు వోసుకున్నట్లు చందమామ.. అలికి ఉన్న వాకిళ్లు చందమామ..” అనే బతుకమ్మ పాటకు నటి రెజీనా, స్టార్ యాంకర్లు సుమ, ఉదయభాను, ఝాన్సీలు నృత్యం చేశారు. వీరితో పాటు సీనియర్ యాక్టర్లు శ్రీలేఖ, అన్నపూర్ణమ్మలు కూడా ఈ పాటలో చక్కటి అభినయంతో మెప్పించారు. ఈ సాంగ్ కి ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా విడుదలైన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.సుమ, ఝాన్సీ, ఉదయభానులు తమ నటనతో అందరిని ఆకట్టుకున్నారు. పట్టు చీరలు కట్టుకుని తెలుగుదనం ఉట్టిపడేలా అందరు కలిసి బతుకమ్మ పాటకు నృత్యం చేశారు. చివర్లో సహజ నటి జయసుధ సైతం ఈ పాటలో భాగమయ్యారు. ఈ సాంగ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.