సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తలైనా ఇట్టే వైరల్ అవుతుంటాయి. అది గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్ ఏదైనా క్షణాలలో సోషల్ మీడియా వేదికగా విస్తరించిపోతుంది. వీటిలో ప్రత్యేకంగా గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ లే వేగవంతంగా వైరల్ అవుతుంటాయి. ఇటీవల నటి స్నేహ విషయంలో ఇదే జరిగింది. స్నేహ కొంతకాలంగా తన భర్త ప్రసన్నకు దూరంగా ఉంటుందని.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు తెగవైరల్ అయ్యాయి. అరే.. ఇద్దరు బాగానే ఉన్నారు కదా! పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరికి ఏమైందని కంగారు పడిపోయారు అభిమానులు.
దీంతో ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ఆఖరికి చేరాల్సిన చోటుకే చేరింది. విడాకులు తీసుకుంటున్నారనే వార్త స్నేహ చెవిన పడేసరికి.. ఎలాంటి రచ్చ చేయకుండా సైలెంట్ గా ఒకే ఒక్క ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టేసింది. స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్స్ సరసన హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన స్నేహ.. పెళ్లి తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. స్నేహ, ప్రసన్న ఇద్దరు కలిసి 2009లో అచ్చముండు అనే సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. అదే సినిమా టైంలో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. చివరికి 2012లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత స్నేహ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. వీరికి కొడుకు విహాన్, కూతురు ఆద్యంత ఉన్నారు. పిల్లలు పుట్టాక కొంతకాలానికి మళ్లీ సినిమాల్లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది స్నేహ. ప్రస్తుతం ఇద్దరూ నటులుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే.. అంతా బాగానే ఉందిగానీ సడెన్ గా ఈ విడాకుల రూమర్స్ బయటికి వచ్చేసరికి కోలీవుడ్ అంతా షాక్ అయ్యిందట. దీంతో తాము సుబ్బరంగా కలిసే ఉన్నామని, ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని.. పుకార్లు నమ్మొద్దని క్లారిటీ ఇస్తూ ఓ పిక్ పోస్ట్ చేసింది. భర్త ప్రసన్నను ముద్దాడుతూ.. వీకెండ్ ట్వినింగ్ అని పిక్ పెట్టింది. ఈ పిక్ తో రూమర్స్ అన్నింటికి చెక్ పడినట్లయింది. ప్రస్తుతం స్నేహ, ప్రసన్నల పిక్స్ నెట్టింట వైరల్ అవుతోంది.