పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. తెలుగు సినిమా రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన హీరో. నిజానికి రూ.100 కోట్ల తెలుగు సినిమాని రూ.2 వేల కోట్ల క్లబ్లో చేర్చిన ఘనత ప్రభాస్కే సొంతం. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ కూడా బాగా ఉంది. అంతేకాకుండా చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కోటి వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కే సినిమాలపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా నుంచి టీజర్ రావడం, మొదట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం చూశాం. కానీ, 3డీలో టీజర్ చూసిన వాళ్లంతా అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఇంత క్రేజ్ ఉన్న ప్రభాస్ లైఫ్లో ఒక ముఖ్యమైన రోజు అంటే అతని ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. అలాంటిది ప్రభాస్ పుట్టినరోజున అతని ఫ్యాన్స్ కి ఒక ఛేదు వార్త అందింది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డేని అంగరంగ వైభవంగా జరపాలని ఫ్యాన్స్ అంతా ఎన్నో ప్లాన్లు వేసుకున్నారు. కానీ, ప్రభాస్ మాత్రమే వారికి షాకింగ్ వార్త చెప్పాడు. తాను ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ చెందారు. ఈ ఏడాది ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కాలం చేసిన విషయం తెలిసిందే. అందుకే ఈ సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశతో ఉన్నారు.
ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. అటు సినిమా బృందాలు సైతం తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తన ప్రాజెక్టులకు సంబంధించి పోస్టర్, టీజర్ లాంటి అప్డేట్స్ ప్లాన్ చేసుకున్నారు. మరి.. వాళ్లు ప్రభాస్ నిర్ణయం విన్న తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రభాస్ వేడుకలకు దూరంగా ఉంటే.. ఇలా పోస్టర్లు విడుదల చేయడం ఎంతవరకు సబబు అనే డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్-కే నుంచి చిన్న అప్డేట్ రాబోతోంది అని ప్రకటించారు. మరి.. వాళ్లు ధైర్యం చేసి రిలీజ్ చేస్తారా? లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రభాస్ నిర్ణయాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. ఎందుకంటే పెదనాన్నతో డార్లింగ్కి ఉన్న అనుబంధం అలాంటింది. వాళ్ల రిలేషన్ను తాము గౌరవిస్తామంటూ ఫ్యాన్స్ సైతం చెప్తూఉండటం విశేషం.