ఓ సినిమా తీయడం కాదు, దాన్ని మార్కెట్ చేసుకోగలగడం పెద్ద టాస్క్. ఆ విషయంలో రాజమౌళిని చాలామంది అభినందిస్తారు. ఎందుకంటే కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్లైమాక్స్ తో రూపాయి ఖర్చు చేయకుండా బాహుబలి తర్వాతి భాగానికి ప్రమోషన్ చేయించుకున్నారు. ఇంతలో కాకపోయినా మిగతా సినిమా టీమ్స్ ఎవరికీ వాళ్లు సరికొత్తగా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూస్ అని, ఫ్యాన్స్ ని డైరెక్ట్ గా కలవడం అని చాలా చేస్తుంటారు. ఇప్పుడు అవన్నీ కాదన్నట్లు కొత్త తరహా ప్రమోషన్స్ మొదలైనట్లు కనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఇతడు కథానాయకుడిగా చేసిన కొత్త సినిమా ‘కృష్ణవిృంద విహారి’. ఇందులో శౌర్య, బ్రహ్మాణ యువకుడిగా నటించాడు. న్యూజిలాండ్ సింగర్, బాలీవుడ్ నటి అయిన షెర్లీ సెటియా హీరోయిన్ గా చేసింది. సెప్టెంబరు 23న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీమ్.. రాజకీయ నాయకుల మాదిరి పాదయాత్రకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా 14న తిరుపతి,15న ఒంగోలు-నెల్లూరు, 16న విజయవాడ- గుంటూరు- ఏలూరు, 17న భీమవరం-రాజమండ్రి, 18న కాకినాడ-వైజాగ్ లో పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేశారు. పోస్టర్ కూడా విడుదల చేశారు. టాలీవుడ్ చరిత్రలో సినిమా కోసం పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి. ఏపీ డీజీపీ కూడా దీనికి అనుమతిచ్చారు. మరి సినిమా కోసం పాదయాత్ర కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. అంతేకాదు చిత్రబృందానికి పోలీసుశాఖ రక్షణ అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: కృష్ణంరాజు అంత్యక్రియల్లోనూ ఫ్యాన్స్ ని మరిచిపోని ప్రభాస్
Coming to walk all the way to you and with you all! ❤️
Join our Team #KrishnaVrindaVihari 🎋 for ‘Paadha Yatra’#KVV #KVVfromSept23rd ✅@ShirleySetia #AnishKrishna #SaiSriram @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/4RkDrBoMFm
— Naga Shaurya (@IamNagashaurya) September 13, 2022