సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వయసు మీదపడటం వలన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి మృతి చెందడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆమె పార్థీవ దేహాన్ని అభిమానులు సందర్శించుకోవానికి పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నట్లు తెలుస్తుంది.
బుధవారం మధ్యాహ్నం ఇందిరా దేవి అంత్యక్రియలను మహాప్రస్థానంలో జరపనున్నట్లు సమాచారం. ఇందిరా దేవి ఆరోగ్యం క్షీణించడంతో గత కొద్దిరోజులుగా మహేష్ ఫ్యామిలీ ఆమె దగ్గరే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆమె మరణించడంతో మహేష్ తో పాటు మహేష్ పిల్లలు గౌతమ్, సితారలు కూడా కన్నీరుమున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా మహేష్ తో పాటు కూతురు సితార.. నాన్నమ్మ లేదనే నిజాన్ని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోతుంది. మహేష్ బాబు ఒడిలో కూర్చుని సితార ఏడుస్తున్న వీడియో ఘట్టమనేని అభిమానులకు బాధకలిగిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఘట్టమనేని ఫ్యామిలీలో మరో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సోదరుడు, కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు.. జనవరి నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. తన అన్నను కోల్పోవడంతో ఎంతో బాధను అనుభవించిన మహేష్ కి.. ఇప్పుడు తాను దైవంగా భావించే తల్లి దూరమవ్వడంతో మరింత కృంగిపోయాడు మహేష్. మహేష్ బాబుకు తల్లి ఇందిరా దేవి అంటే ఎంతో ప్రేమ, మమకారం. చిన్నతనం అంతా ఆమె దగ్గరే పెరిగాడు. మరోవైపు సితార, గౌతమ్ లు కూడా నాన్నమ్మ దగ్గర టైం స్పెండ్ చేస్తుండేవారు. ఇంతలోనే ఇలా జరగడంతో ఘట్టమనేని ఫ్యామిలీకి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుతున్నారు.
@urstrulyMahesh Anna 💔😭#RipIndiraDeviGaru pic.twitter.com/AFSzbK31sh
— SSMBFANS FOREVER FC (@SSMBFANSFOREVER) September 28, 2022