తెలుగు హీరోగా నాగార్జున ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. నిర్మాతగానూ ఫేమ్ సంపాదించారు. ప్రస్తుతం తను హీరోగా చేసిన ‘ద ఘోస్ట్’ మూవీని విడుదలకు సిద్ధం చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా.. దసరా కానుకగా అక్టోబరు 5న థియేటర్లలోకి రానుంది. ఇకపోతే నాగ్.. రాజకీయాల్లోకి వస్తారని, ఎంపీగానూ పోటీ చేస్తారని గత కొన్నాళ్ల క్రితం న్యూస్ బయటకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ.. తన పొలిటికల్ ఎంట్రీపై నాగ్ క్లారిటీ ఇచ్చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరో నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన సినిమా ‘ద ఘోస్ట్’. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ఈ క్రమంలో చిత్రం గురించి మాట్లాడారు. సినిమాపై తమకు నమ్మకముందని, గతంలో తను హీరోగా చేసిన ‘కిల్లర్’, ‘ద ఘోస్ట్’కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇందులో యాక్షన్ తో పాటు చాలా ఎమోషన్ ఉందని అన్నారు. ఒకవేళ సినిమా హిట్ అయితే సీక్వెల్ తీస్తామని నాగ్ క్లారిటీ ఇచ్చారు.
ఇక తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన నాగ్.. ‘నేను విజయవాడ ఎంపీగా పోటీచేస్తాననే ప్రచారంలో నిజం లేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్ గా నటిస్తాను. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నేను పోటీ చేస్తాననే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా అలానే జరిగింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు’ అని హీరో నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు. మరి నాగ్ రియాక్షన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.