Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున వైఎస్సార్ సీపీలో చేరబోతున్నారంటూ .. విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ విషయంపై అటు నాగార్జున నుంచి కానీ, వైఎస్సార్ సీపీ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ జర్నలిస్ట్ జాఫర్ ఈ ప్రచారంపై ఓ విశ్లేషణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఆ ప్రచారం అవాస్తవం. అక్కినేని కుటుంబం అన్ని రాజకీయ పార్టీలకు సమానమైన దూరాన్ని పాటిస్తుంటుంది.
వివాదాలకు దూరంగా ఉంటుంది. ముఖ్యంగా పొలిటికల్ కాంట్రవర్సీలకు బహు దూరంగా ఉంటారు. సీఎం ఎవరైనా కూడా వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. అప్పుడు వైఎస్సార్, చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్ జగన్లతో నాగార్జున మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. విజయవాడ గురించి ఎందుకు ప్రచారం జరుగుతుందంటే.. అక్కడ వైఎస్సార్ సీపీ క్యాండిడేట్ లేడు. పొట్లూరి వర ప్రసాద్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన అంత యాక్టీవ్గా లేరని చెప్పాలి. కాబట్టి వైఎస్సార్ సీపీ అధిష్టానం అక్కడ ఓ మంచి క్యాండిడేట్ కోసం సెర్చ్ చేస్తా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఒక వేళ నాగార్జున వైఎస్సార్ సీపీలోకి వస్తే ఆయన కేవలం టీడీపీతోనే కాదు.. మెగా ఫ్యామిలీతోనూ విరోధం పొందాల్సి ఉంటుంది. మెగా బ్రదర్ పవన్ కల్యాణ్కు జనసేన పార్టీ ఉంది. దీంతో మెగా బ్రదర్స్తో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక, నాగ్కు చిరుతో, అల్లు అరవింద్తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ నా అభిప్రాయాలు తప్పయి ఆయన వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ తరపున పోటీ చేస్తే.. పెను సంచలనమే అవుతుంది’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Wine Shops: బ్రేకింగ్: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు మద్యం షాపుల బంద్!