సుడిగాలి సుధీర్.. ఈ పేరు వినగానే అందరికి తెలుగు బుల్లితెర స్టార్ గా గుర్తొస్తాడు. ఎందుకంటే.. ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ చేసి సుధీర్ ఆఖరికి జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పాపులర్ షోలతో రెగ్యులర్ గా ప్రేక్షకులను అలరిస్తుండేవాడు. అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూ అయినా తెరపై కనిపిస్తుండేవాడు. కానీ.. ఈ మధ్య ఈటీవీ నుండి వెళ్లిపోయి స్టార్ మా టీవీలో చేరాడో లేదో.. కొద్దిరోజులకే మొత్తానికి కనిపించకుండా పోయాడు. ఆ ఛానల్ ని నమ్ముకొని బయటికి రావడం వల్లే సుధీర్ కొంప మునిగిందా? సుధీర్ బిగ్ మిస్టేక్ చేశాడా? అనే సందేహాలు వెలువడుతున్నాయి.
జబర్దస్త్ లో కమెడియన్ గా, ఢీలో మెంటర్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీలో హోస్ట్ గా ఓ రేంజ్ క్రేజ్ ని ఎంజాయ్ చేసిన సుధీర్.. ఇప్పుడు ఏ షోలోను హోస్ట్ గా, మెంటర్ గా కాదు కదా.. కనీసం కమెడియన్ గా కూడా కనిపించట్లేదు. చేతినిండా ప్రోగ్రాంలతో కంటిన్యూ అవుతున్న సుధీర్ కి ఎక్కువ డబ్బు ఆశ చూపి ఛానల్ నుండి బయటికి తీసుకొచ్చారా? లేక సుధీరే పక్క ఛానల్ ఎక్సట్రా పేమెంట్ ఇస్తామన్నారని వెళ్లిపోయాడా తెలియదు. కానీ.. ప్రస్తుతం సుధీర్ హోస్ట్ గా చేస్తున్న షో అర్థాంతరంగా ఆగిపోయినట్లు తెలుస్తుంది.
సుధీర్ ని బయటికి పంపడమో, లాగడమో మొత్తానికి ఏదొకటి జరిగింది.. సుధీర్ చేతిలో ఇప్పుడు ఏ షోలు లేవని టాక్. మరోవైపు అదే ఛానల్ ని నమ్ముకొని వచ్చిన యాంకర్ అనసూయకు కూడా ప్రెజెంట్ చేస్తున్న షోలు ఆగిపోయేసరికి ఎదురుదెబ్బ తగిలినట్లైందని అంటున్నారు. ఇప్పుడు సుధీర్, అనసూయ బయటికి రావడంతో ప్లస్ అయ్యింది.. ఆయా టీవీ ప్రోగ్రామ్స్ కి, యాంకర్ రష్మీకేనట. ఎందుకంటే.. ఎక్సట్రా జబర్దస్త్ ని మాత్రమే హోస్ట్ చేసే రష్మీ.. సుధీర్ అనసూయ బయటికి వచ్చేసరికి అటు జబర్దస్త్ ని, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీని చేజిక్కించుకుంది.
ఈ టీవీ ప్రోగ్రాంల సంగతి పక్కన పెడితే.. సుధీర్, అనసూయ సినిమాలలో కూడా పెద్దగా బిజీ కాలేకపోయారట. సినిమా షూటింగ్స్ అనేవి రెగ్యులర్ జరిగేవి కాదని తెలిసిందే. మరోవైపు ఇద్దరు కలిసి వాంటెడ్ పండుగాడ్ మూవీ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అదీగాక సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఏ ఊసు లేదు. గాలోడు, సహస్ర అప్ డేట్స్ లేవు. ఇవన్నీ కాదు రెస్ట్ తీసుకుంటున్నాడేమో అనుకుంటే.. సోషల్ మీడియాలో ఆరోగ్యం బాలేదని, ఏదో జబ్బు చేసిందంటూ నెగటివ్ ప్రచారాలు చేస్తున్నారు. సినిమాలో, టీవీ షోలో ఏవి చేయకపోయినా.. కాస్త టైం తీసుకొని ఫ్యాన్స్ ని సోషల్ మీడియా వేదికగా ఓసారి పలకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై ఇకనైనా సుధీర్, అనసూయలు స్పందిస్తారేమో చూడాలి.