సినీ ఇండస్ట్రీ అంటే అదో రంగుల ప్రపంచం అనుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా వెండితెరపై కనిపిస్తే చాలు అనుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఇందుకోసం ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ప్రతిరోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే వెండితెరపై నటించే వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని అనుకుంటారు.. కానీ కొంత మంది నటీనటుల జీవితాల్లో ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు ఉంటాయని పలు సంఘటనలు వెలుగు చూశాయి. అప్పటి వరకు వెండితెరపై వెలిగిపోయిన వారు ఛాన్సులు రాక దుర్భరమైన జీవితాలు అనుభవించిన వారు ఉన్నారు. అనారోగ్యంతో చావు వరకు వెళ్లివచ్చిన నటీనటులు ఉన్నారు.
ఇటీవల సోషల్ మీడియా వేధికగా పలువురు సినీ తారలు తాము పలానా జబ్బుతో బాధపడుతున్నామిన ఫ్యాన్స్ కి తమ కష్టాలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సమంత తనకు ఉన్న అరుదైన వ్యాధి గురించి తెలియజేసింది.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు ఇన్ స్ట్రాలో తెలిపింది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ తాను చాలా కాలంగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నట్లు ఫ్యాన్స్ కి తెలిపింది. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.
హైదరాబాద్ లో పుట్టిన ఫాతిమా సనా షేక్ కెరీర్ బిగినింగ్ లో బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది. తర్వాత తెలుగు లో నువ్వు నేను ఒకటవుదాం చిత్రంలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక 2016 లో దంగల్ చిత్రంలో స్టార్ క్రీడాకారినిగా మెప్పించి అందరి మనసు దోచింది ఫాతిమా సనా షేక్. ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి. వెండితెరపైనే కాదు ఇటీవల బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది ఫాతిమా సనా షేక్. ఈ మద్య ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న క్రమంలో ఫాతిమా సనా షేక్ తనకు ఉన్న మూర్ఛ వ్యాధి గురించి తెలిపింది.
ప్రస్తుతం మెడికేషన్ సహాయంతో తన పరిస్థితి అదుపులో ఉందని తెలిపింది ఫాతిమా సనా షేక్. తాను ఏ ప్రాజెక్ట్ లో అయినా నటించేముందు నిర్మాతలకు తన వ్యాధి గురించి తెలియజేస్తానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తున్నారని.. అందుకే తాను బలంగా ఉన్నట్టు ఫాతిమా సనా షేక్ తెలియజేసింది. దంగల్ మూవీ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ వ్యాధి బయటపడినట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.