విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. దేశం మొత్తం షేక్ చేస్తాం అని ప్రచారం చేశారు. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత కంటెంట్ తేలిపోయేసరికి చిత్రం బోల్తా కొట్టేసింది. ఇక హీరో విజయ్.. రెమ్యునరేషన్ కొంత మొత్తం తిరిగిచ్చేశాడని, పూరీ-ఛార్మీ.. ముంబయిలోని అద్దె కట్టలేక ఫ్లాట్ కట్టలేక ఖాళీ చేశారని చాలా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఛార్మి ట్విట్టర్ వేదికగా స్పందించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2001లో ‘నీ తోడు కావాలి’ చిత్రంతో నటిగా ఛార్మి టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కొన్నింట్లో ప్రత్యేక గీతాలు కూడా చేసింది. చివరగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’తో లాభాలు పొందిన ఈ ద్వయం.. అదే ఊపులో ‘లైగర్’ కాంబినేషన్ సెట్ చేశారు. త్వరగా సెట్స్ పైకి వెళ్తుందనేసరికి కరోనా మహమ్మారి మన జీవితంలోకి ఎంటరైంది. దీంతో ఎప్పుడో పూర్తవ్వాల్సిన సినిమా కాస్త.. బాగా ఆలస్యమైంది. ఈ ఆగస్టు 25న దేశవ్యాప్తంగా రిలీజైంది.
ఇక ఈ సినిమా ఫలితం తేడా కొట్టేసరికి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో కొన్నాళ్ల పాటు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటానని ఛార్మి ట్వీట్ చేసింది. ఈ టైమ్ లో పూరీ-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తీస్తున్న మరో సినిమా ‘JGM’పూర్తిగా ఆగిపోయిందనే వార్తలొచ్చాయి. వీటిని అటు పూరీ-ఛార్మి గానీ.. ఇటు విజయ్ గానీ ఖండించలేదు. దీంతో ఇది నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో ట్వీట్ చేసిన ఛార్మీ.. రూమర్స్ అన్నీఫేక్ అని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్.. ‘JGM’సినిమా ఉన్నట్లా?లేనట్లా? అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ గందరగోళం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: విజయ్ తో ‘జనగణమన’ మూవీని పక్కన పెట్టేసిన పూరి జగన్నాథ్..?
Rumours rumours rumours!
All rumours are fake!
Just focusing on the progress of 𝐏𝐂 ..
Meanwhile, RIP rumours !!— Charmme Kaur (@Charmmeofficial) September 8, 2022
Chill guys!
Just taking a break
( from social media )@PuriConnects will bounce back 😊
Bigger and Better…
until then,
Live and let Live ❤️— Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022